Home / SLIDER / తడిచిన ధాన్యంతో సహా చివరి గింజ వరకు కొంటాం’- సీఎం కేసీఆర్

తడిచిన ధాన్యంతో సహా చివరి గింజ వరకు కొంటాం’- సీఎం కేసీఆర్

తడిచిన వరిధాన్యాన్ని కూడా కొంటామని… ఈ విషయంలో ఆందోళన చెందవద్దని ముఖ్యమంత్రి కేసీఆర్… రైతులకు భరోసానిచ్చారు. హైదరాబాద్​ ప్రగతిభవన్​లో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో వరిధాన్యం సేకరణపై సీఎం సమీక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న వరిధాన్యం సేకరణపై ఆరా తీశారు. ధాన్యం తూకం, గన్నీ బ్యాగులు, రవాణా, మిల్లుల్లో దిగుమతి తదితర వరిధాన్య సేకరణ ప్రక్రియ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

మొత్తం 56 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నామని… ఇప్పటి వరకు 20 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యాన్ని సేకరించినట్లు అధికారులు సీఎంకు వివరించారు. వర్షాకాలం సమీపిస్తుండడంతో ధాన్యం సేకరణ వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అకాల వర్షాల కారణంగా అక్కడక్కడ వరిధాన్యం తడుస్తున్న నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని చెప్పారు. తడిసిన ధాన్యాన్ని చివరి గింజ వరకు ప్రభుత్వం కొంటుందని సీఎం స్పష్టం చేశారు. ఎంత ఖర్చయిన రాష్ట్ర ప్రభుత్వమే భరించి చివరి గింజ వరకు కొంటుందని స్పష్టం చేశారు. కేంద్రం కొన్నా కొనకున్నా బాయిల్డ్ రైస్​ను ఖర్చుకు వెనకాడకుండా రాష్ట్ర ప్రభుత్వమే కొంటుందని ముఖ్యమంత్రి మరోసారి స్పష్టం చేశారు.

అంతకుముందు రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 20 నుంచి ప్రారంభం కానున్న పల్లె, పట్టణ ప్రగతి అమలు సహా.. బృహత్ పల్లె ప్రకృతి వనాల అభివృద్ధిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్షించారు. వైకుంఠధామాలు, సమీకృత వెజ్- నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణాలు, వరి ధాన్యం సేకరణపై సమాలోచనలు చేశారు. రాష్ట్రాలు, స్థానికసంస్థల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని కేసీఆర్ తప్పుపట్టారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat