బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారా? అంటే అవుననే సమాధానమే ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోంది. లేటెస్ట్గా ఆయన చేసిన ట్వీట్ దీనికి మరింత బలం చేకూరుస్తోంది. క్రీడా జీవితాన్ని ప్రారంభించి 30 సంవత్సరాలు గడిచాయని.. ఇప్పుడు కొత్త మార్గంలో నడవాలని భావిస్తున్నట్లు ఆయన తన ట్విటర్లో పేర్కొన్నారు. ఈ మేరకు లేఖను గంగూలీ పోస్ట్ చేశారు.
ఎప్పటినుంచో గంగూలీ రాజకీయ రంగ ప్రవేశంపై ఊహాగానాలు వస్తున్నాయి. తృణమూల్ కాంగ్రెస్లో చేరతారని ప్రచారం జరిగినా.. తాజాగా జరిగిన పరిణామాలను బట్టి చూస్తే ఆయన బీజేపీలో చేరే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఆ పార్టీకి చెందిన ముఖ్యనేతలు కొందరు ఆయన్ను కలవడం ఈ వాదనకు బలం చేకూర్చింది. ఈ నేపథ్యంలో ఆయన ట్విటర్లో ఓ లేఖను పోస్ట్ చేయడం ఆసక్తికరంగా మారింది.
గంగూలీ పోస్ట్ చేసిన లెటర్..