జైనథ్ మండలం పెండల్ వాడ గ్రామంలో ఏర్పాటుచేసిన మన ఊరు మన బడి కార్యక్రమంలో ఎమ్మెల్యే జోగు రామన్న గారు పాల్గొని అదనపు విద్య మౌలిక వసతులకు కృషి చేస్తూ భూమి పూజ కార్యక్రమాన్ని చేపట్టారు…
మొదట గ్రామస్తులు ఎమ్మెల్యే కు ఘన స్వాగతం పలికారు.. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం స్థానిక సంస్థల పాఠశాలల బలోపేతానికి ప్రతిష్టాత్మకంగా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ విద్యా ప్రణాళిక వ్యవస్థలు పటిష్ట చేస్తుందన్నారు… రాష్ట్ర ప్రభుత్వం 7,500 కోట్లు మూడో విడతలో అన్ని స్కూల్ లకు మంజూరు,చేస్తూ ప్రైవేటుకు ధీటుగా విద్యా వ్యవస్థలో మార్పు తీసుకురావడం జరుగుతుంది అన్నారు .
ఎస్సీ ఎస్టీ బిసి ఓసి పేద విద్యార్థుల ఉన్నత చదువు పై కేజీ టు పీజీ ఇంగ్లీష్ చదువులను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఇప్పటివరకు 750 రెసిడెన్షియల్ గురుకులాలను ఏర్పాటు చేస్తూకొని ప్రారంభించడం జరిగిందన్నారు.తల్లిదండ్రులు కలలు కంటున్న టువంటి చదువులు విద్యార్థులకు అందిస్తున్నామని తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో చైర్మన్ అడ్డి భోజ రెడ్డి.. ఎంపీపీ మారిశెట్టి గోవర్ధన్, వెంకట్ రెడ్డి,చంద్రయ్య, లింగారెడ్డి గ్రామ సర్పంచ్ గ్రామస్తులు పాల్గొన్నారు..