రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) అధినేత ముకేశ్ అంబానీ తిరిగి తన స్థానాన్ని చేజిక్కించుకున్నారు. కొద్ది నెలలుగా ఆసియాలో అత్యంత శ్రీమంతుడిగా కొనసాగుతున్న గౌతమ్ అదానీ స్థానాన్ని తిరిగి అంబానీ ఆక్రమించారు.
ఆర్ఐఎల్ షేరు ధర రెండు వారాల నుంచి దూడుకు ప్రదర్శించడం, అదానీ గ్రూప్ షేర్లు క్షీణించడంతో ఈ మార్పు జరిగింది. బ్లూంబర్గ్ రిపోర్ట్ ప్రకారం తాజాగా ముకేశ్ సంపద 99.7 బిలియన్ డాలర్లకు (రూ.7.74 లక్షల కోట్లు) చేరింది.
98.7 బిలియన్ డాలర్ల (రూ.7.66 లక్షల కోట్లు) సంపదతో అదాని గ్రూప్ చైర్మన్ గౌతమ్ ద్వితీయస్థానంతో సరిపెట్టుకున్నారు. దీంతో భారత్లో సైతం ముకేశ్ అంబానీ అత్యంత ఐశ్వర్యవంతుడయ్యారు. ప్రస్తుతానికి అదాని ద్వితీయస్థానానికి దిగినప్పటికీ, రెండేండ్లుగా ఆయన సంపద గణనీయంగా పెరిగింది.