తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరో అక్కినేని నాగచైతన్య తో విడిపోయిన తర్వాత హాట్ బ్యూటీ.. స్టార్ హీరోయిన్ సమంత దూకుడు పెంచింది. ఒకవైపు ముఖ్యమైన పాత్రల్లో నటిస్తూనే మరోవైపు ఐటెం సాంగ్ లో దుమ్ము దులుపుతుంది.
తాజాగా ఇటీవల విడుదలైన విక్రమ్ మూవీ హిట్ సాధించడంతో దర్శకుడు లోకేష్ కనగరాజ్ తర్వాత చిత్రం విజయ్ తో తెరకెక్కించబోతున్నాడు. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ గా సమంతను ఎంపిక చేసుకున్నట్లు ఫిల్మ్ నగర్లో వార్తలు గుప్పుమంటున్నాయి.
అయితే దర్శకుడు లోకేష్ గత చిత్రాలకు భిన్నంగా ఈ చిత్రంలో ఎక్కువగా హీరోయిన్ కే ఎక్కువ ప్రాధాన్యం ఉండటంతో సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. చూడాలి మరి ఈ మూవీ ఎప్పుడు షూటింగ్ మొదలెడుతుందో..?