నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై ఈడీ విచారణ కేంద్రం కక్షేమీ కాదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. పార్లమెంట్ స్థాయీ సంఘానికి సంబంధించిన నివేదికను ఛైర్మన్ హోదాలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి ఢిల్లీలో ఆయన అందించారు. అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాహుల్పై ఈడీ కేసుపై స్పందించారు. ఇందులో కక్ష సాధింపేమీ లేదని.. కర్మ సిద్ధాంతం ప్రకారం చేసిన పాపాలు అనుభవించాల్సిందేనన్నారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ వైఖరిపై విజయసాయిని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ఈ విషయంపై పార్టీ అధినేత, సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.