రాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్ఎస్ మద్దతు ఎవరికి ఉంటుంది? ఈ విషయంలో ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని రాజకీయాలపై ఆసక్తి ఉన్న అందరూ వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి, కేంద్ర మాజీమంత్రి యశ్వంత్ సిన్హాకు కేసీఆర్ మద్దతిస్తారని శరద్ పవార్ చెప్పారు. ముంబయిలో నిర్వహించిన ప్రెస్మీట్లో ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. యశ్వంత్ సిన్హా అభ్యర్థిత్వంపై కేసీఆర్త రెండుసార్లు మాట్లాడానని పవార్ చెప్పారు. అయితే దీనిపై టీఆర్ఎస్ పార్టీ వర్గాలు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.