Home / ANDHRAPRADESH / అమ్మ ఒడి పథకంపై మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు

అమ్మ ఒడి పథకంపై మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో  విద్యార్థుల కోసం అమలు చేస్తున్న అమ్మ ఒడి పథకంలో కోతలు విధించిన విషయాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ అంగీకరించారు. విద్యార్థులు అర్ధాంతరంగా బడి మానేయకుండా అమ్మ ఒడిని ప్రారంభించిందని మరోసారి స్పష్టం చేశారు.

విజయనగరంలో నిర్వహించిన కార్యక్రమంలో  మంత్రి బొత్స నారాయణ మాట్లాడుతూ  75 శాతం హాజరు ఉన్న విద్యార్థులకు అమ్మ ఒడిని ఇస్తున్నామని పేర్కొన్నారు.ఇందులో నుంచి వెయ్యి రూపాయలు మెయింటెనెన్స్‌కు, మరో వెయ్యి వాచ్‌మెన్‌, ఇతర అవసరాలు వినియోగిస్తామని మంత్రి  వెల్లడించారు.

రాష్ట్రంలోని విద్యార్థులకు మెరుగైన విద్యాబ్యాసం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలను తెలుసుకుని తమతమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలో చేర్పించాలని సూచించారు.ఏపీ ప్రభుత్వం ప్రతి సంవత్సరం అమ్మ ఒడి స్కీం క్రింద ప్రతి ఒక్క విద్యార్థికి రూ.15 వేలు ఇస్తుండగా ఈ సంవత్సరం నుంచి 13వేలు మాత్రమే ఇస్తూ 2వేలు కోత విధించింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat