టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి ఆకస్మిక మృతి నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. తన తల్లి సూసైడ్ చేసుకుని చనిపోయిందంటూ ఉమామహేశ్వరి కుమార్తె దీక్షిత పోలీసులకు తెలిపినట్లు సమాచారం. అనారోగ్య కారణాలతోనే ఆమె చనిపోయినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఉస్మానియా హాస్పిటల్లో ఉమామహేశ్వరి మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహిస్తున్నారు. ఉస్మానియా హాస్పిటల్ వద్దకు ఆమె సోదరులు రామకృష్ణ, బాలకృష్ణతో పాటు నారా లోకేశ్ చేరుకున్నారు. పోస్ట్మార్టం నివేదిక ఆధారంగా ఉమా మహేశ్వరి ఎలా చనిపోయారన్నది తెలిసే అవకాశముంది.