కామన్వెల్త్ గేమ్స్లో ఇండియన్ స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు అదరగొట్టింది. బ్యాడ్మింటన్ ఉమెన్స్ సింగిల్స్లో సింధు గోల్డ్ మెడల్ సాధించి విశ్వవేదికపై మరొక్కసారి తన సత్తా చాటింది.
సింగిల్స్ ఫైనల్లో కెనడా క్రీడాకారిణి మిచెల్ లీపై సింధు విజయం సాధించింది. ఫస్ట్ గేమ్లో 21-15, రెండో గేమ్లో 21-13తో జయకేతనం ఎగురవేసి పసిడి పతకాన్ని ముద్దాడింది. దీంతో కామన్వెల్త్ గేమ్స్లో ఇండియా సాధించిన పతకాల సంఖ్య 56కి చేరింది. వీటిలో 19 గోల్డ్, 15 సిల్వర్, 22 బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి.
పీవీ సింధు స్వర్ణం సాధించడం పట్ల తెలుగు రాష్ట్రాల్లోని ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆమె తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.