ఏంటా మొద్దు నిద్ర.. అస్తమానం ఇలా పడుకొంటే జీవితంలో ఏం సాధించలేవు.. అంటూ పొద్దున్నే తల్లిదండ్రుల చీవాట్లు వింటూనే ఉంటాం. గంటల తరబడి అలా నిద్రపోతే నీ చేతికి ఎవరైనా డబ్బులు తెచ్చి ఇస్తారా.. అంటూ బామ్మల మాటలు వింటాం.. అయితే త్రిపర్ణా చక్రవర్తి మాత్రం దీన్ని ఫ్రూవ్ చేసింది. గంటల గంటలు హాయిగా నిద్రపోయి రూ.5 లక్షలు సొంతం చేసుకుంది. ఎస్ మీరు చదివింది నిజమే..
వేక్ ఫిట్ అనే ఓ సంస్థ ఓ వినూత్నమైన పోటీని నిర్వహించింది. ఎవరైతే వరుసగా 100 రోజులు రాత్రిపూట ఏ ఆటంకం లేకుండా 9 గంటలు గాఢంగా పడుకుంటారో వారిని విజేతగా నిర్ణయించి ప్రైజ్ మనీ అందిస్తుంది. ఆరోగ్యానికి నిద్ర చాలా ఇంపార్టెంట్. దీని ప్రాముఖ్యత తెలిపేందుకు ఇలాంటి కార్యక్రమాన్ని చేపడుతోంది.
లక్షల మంది దరఖాస్తు..
సీజన్-2(2021) పోటీల్లో దేశవ్యాప్తంగా 5.5 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో చివరకు 15 మంది మిగలగా వారిలో కోల్కతాకు చెందిన 26 ఏళ్ల త్రిపర్ణ గెలిచింది. స్లీప్ ఛాంపియన్గా త్రిపర్ణ రూ.5 లక్షలు గెలుచుకుంది. మిగిలిన 14 మందికి ఒక్కొక్కరికి రూ.1 లక్ష అందించారు.