టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో సీనియర్ స్టార్ హీరో. సూపర్ స్టార్ మహేష్ బాబు మాతృమూర్తి.. సీనియర్ హీరో కృష్ణ సతీమణి అయిన ఇందిరా దేవి బుధవారం తెల్లవారు జామున నాలుగంటలకు కన్నుమూశారు.
గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్ మహానగరంలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ రోజు తెల్లవారు జామున ఆమె కన్నుమూసినట్లు వైద్యులు తెలిపారు. ఇందిరా దేవి మృతిపట్ల సినీ రాజకీయ ప్రముఖులందరూ తమ సంతాపాన్ని తెలుపుతున్నారు.
అయితే ఇందిర అంతిమ సంస్కారాలు ఈ రోజు బుధవారం సాయంత్రం మహాప్రస్థానంలో నిర్వహించనున్నారు. ఇందిరా కృష్ణ దంపతులకు ఐదుగురు సంతానం. రమేష్ బాబు.. మహేశ్ బాబు.. పద్మావతి. మంజుల.. ప్రియదర్శిని. అయితే ఇటీవల మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు కూడా కన్నుమూసిన సంగతి విదితమే. ఇప్పుడు తల్లి ఇందిరా మృతితో ఘట్టమనేని కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి.