సోషల్ మీడియాలో మంచు కుటుంబంపై మెమెస్ ..ట్రోలింగ్ జరగడం మనం గమనిస్తూనే ఉంటాము. అయితే ఈ ట్రోల్స్ వెనక ఓ స్టార్ హీరో ఉన్నట్లు మంచు హీరో విష్ణు సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న మీడియాతో మాట్లాడుతూ తన కుటుంబం గురించి.. తన గురించి కించపరుస్తూ వీడియోలు పెడుతున్న ట్రోలర్స్పై ఘాటుగా స్పందించారు.
వారిపై త్వరలోనే సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయబోతున్నట్లు ఆయన తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తనపైనా, తన కుటుంబంపైనా పనిగట్టుకొని ట్రోలింగ్ చేస్తున్న వాళ్లని ఇకపై వదిలిపెట్టేదిలేదని విష్ణు హెచ్చరించారు.
తమపై ట్రోలింగ్ చేయించేందుకు టాలీవుడ్ హీరో ఒకరు 21 మంది ఉద్యోగులను నియమించుకున్నారనీ, అందుకు సంబంధించిన పూర్తి ఆధారాలను త్వరలోనే సైబర్క్రైమ్ పోలీసులకు సమర్పిస్తానని ఆయన తెలిపారు.