సూపర్ స్టార్ మహేష్బాబు వరుస సినిమాలను తీస్తూ ఘనవిజయాలను సాధిస్తూ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతూ ఉండు.. ఈ నేపథ్యంలో మహేష్ బాబు ప్రస్తుతం తెలుగు సినిమా మాటల మాంత్రికుడు.. హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ మూవీ చేస్తున్నాడు. గతంలో త్రివిక్రమ్ తో మహేశ్ బాబు అతడు, ఖలేజా వంటి క్లాసిక్స్ తర్వాత ఈ కాంబో మూడో సారి జతకట్టడంతో అటు అభిమానులలో ఇటు ప్రేక్షకులలో విపరీతమైన క్యూరియాసిటీ పెరిగింది.
తాజాగా మరో సీనియర్ నటిని కీలకపాత్ర కోసం ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. ఎవరా సినీయర్ నటి అనుకంటున్నారా ఆమె మరోవరో కాదు శోభన. ఒకప్పుడు శోభన దక్షిణాదిన అగ్రతారగా వెలుగొందింది. ఏడాదికి నాలుగైదు సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉండేది. ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లోనూ వరుస ప్రాజెక్ట్లతో బిజీగా గడుపుతుంది. కాగా తాజాగా త్రివిక్రమ్ SSMB28లో కీలకపాత్ర కోసం ఈమెను సంప్రదించాడట. ఈమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది.
ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సినిమాలో మహేష్కు జోడీగా పూజా హెగ్డే నటిస్తుంది. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్.చినబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మ్యూజిక్ సెన్సేషన్ థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది అగస్టులో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.