భారతీయ జనతాపార్టీ .. మోదీ సర్కారు పై ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్లో గత 15 ఏండ్లుగా అధికారం చలాయిస్తూ ఇక్కడి ప్రజల కోసం చేసిందేమీ లేదని ఆ ప్రజలకు సేవ చేయడంలో ఘోరంగా విఫలమైందని ఆయన విమర్శించారు.
ఈ రోజు ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల పోలింగ్ జరుగుతోందని, దాదాపు కోటిన్నర మంది ఢిల్లీ వాసులు ఓటు వేయబోతున్నారని, కాబట్టి సరిగ్గా పని చేస్తుందని నమ్మిన పార్టీనే ఈ ఎన్నికల్లో గెలిపించాలని తాను ఓటర్లను కోరుతున్నానని సిసోడియా కోరారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడమే ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ ప్రధాన కర్తవ్యమని, తాము గెలిస్తే ఢిల్లీని క్లీన్ చేస్తామని చెప్పారు.