బంగ్లాదేశ్తో జరిగిన మూడో వన్డే, తొలి టెస్టుకు డేరింగ్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ .. కెప్టెన్ రోహిత్ శర్మ బొటనవేలి గాయంతో దూరమైన తాజాగా రెండో టెస్టుకు కూడా దూరమయ్యాడు.
ఈ నెల 22న ఢాకాలో చివరిదైన రెండో టెస్టు ప్రారంభమవుతుంది. గాయం తర్వాత ముంబైకి చేరుకున్న రోహిత్ అక్కడే చికిత్స తీసుకుంటున్నాడు. గాయం తీవ్రంగా ఉండడంతో రెండో టెస్టుకు కూడా దూరమయ్యాడు.
రోహిత్ దూరం కావడంతో తొలి టెస్టుకు సారథ్యం వహించిన కేఎల్ రాహుల్.. రెండో టెస్టులోనూ జట్టును నడిపించనున్నాడు. చటోగ్రామ్లో జరిగిన తొలి టెస్టులో అద్భుత ఆటతీరు కనబర్చిన భారత్ 188 పరుగుల తేడాతో విజయం సాధించి రెండు టెస్టుల సిరీస్లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఈ విజయంతో ప్రపంచ టెస్టు చాంపియన్షిప్స్ పాయింట్ల పట్టికలో భారత్ రెండో స్థానానికి ఎగబాకింది.