ప్రముఖ భారతదేశ వ్యాపార దిగ్గజం అయిన గౌతమ్ అదానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ అదానీ గ్రూప్ వ్యాపార సంస్థ ఇప్పటిది కాదు.. దాదాపు ముప్పై ఏండ్ల కిందట ప్రారంభమైంది..
రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నసమయంలోనే ఈ సంస్థను ప్రారంభించాను.. ఆ తర్వాత ఎంతో మంది ప్రధానమంత్రులు వచ్చారు. మరెంతో మంది రాజకీయ నేతలు అధికారంలోకి వచ్చారు.
నా సంస్థ యొక్క అభివృద్ధి ఏ ఒక్క నాయకుడి వల్ల జరగలేదు. తన సామ్రాజ్యం మూడు దశాబ్ధాల సమయంలో ఏ ఒక్క నాయకుడితో ముడిపెట్టలేము. ప్రధాన మంత్రి నరేందర్ మోదీ తాను ఒకే రాష్ట్రానికి చెంది ఉండటం వల్ల ఇలా ఆరోపణలు చేస్తున్నారు అని ఆయన వాపోయారు. ఓ ప్రముఖ ఆంగ్ల టీవికిచ్చిన ఇంటర్వూలో అదానీ ఇదంతా చెప్పుకోచ్చారు.