VALLABHANENI: చంద్రబాబు బహిరంగ లేఖపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. చేతకాని వాడే ఉత్తరాలు రాస్తారని….అందుకే చంద్రబాబు లేఖలు రాస్తున్నారని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు కష్టం వస్తే ఏదో ప్రపంచానికి వచ్చినట్లు ఇష్టానుసారం ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.
ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు ఏం చేసామో చూపించడం ముఖ్యం, లేకపోతే అధికారంలోకి వస్తే ఏం చేయాలో ఆలోచించాలి తప్ప ఇలా పిచ్చి పిచ్చి రాతలు రాయడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు వయసు మళ్లింది. అందుకే ఇలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.
అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేని చంద్రబాబు…..అధికారం లేనప్పుడు ఏం చేయగలరని విమర్శించారు. కనీసం వార్డు మెంబర్ గా కూడా గెలవలేని వ్యక్తిని మాపై ఉసిగొల్పుతున్నారని మండిపడ్డారు. లోకేశ్ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి. అతని మాటలకు ఎవరూ పడరని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకే భయపడని వాళ్లు…..లోకేశ్ కు భయపడతారా అని ఎద్దేవా చేశారు.
ఓ మహిళా అధికారితో అసభ్యంగా మాట్లాడిన వ్యక్తి అచ్చెన్నాయుడు…చివరికి చంద్రబాబు కాళ్లు పట్టుకున్నాడని తెలిపారు. అలాంటి అచ్చెన్నాయుడు నాగురించి మాట్లాడితే….నేను ఆయన చరిత్ర మొత్తం బయటపెడతానని వ్యాఖ్యానించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే వ్యక్తి సీఎం జగన్, బీసీలకు సముచిత స్థానం కల్పించారని పేర్కొన్నారు. చంద్రబాబు డబ్బుల కోసం పదవులు అమ్మిన వ్యక్తి అని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు.