Home / SLIDER / భూమి పుత్రుడికి బూతు పురాణంకు జరుగుతున్న యుద్ధం..

భూమి పుత్రుడికి బూతు పురాణంకు జరుగుతున్న యుద్ధం..

నేను ఖమ్మం భూమి పుత్రుడను అని.. నేడు భూమి పుత్రుడిని బూతు పురాణం కు జరుగుతున్న యుద్ధం అని ఖమ్మం నియోజకవర్గ BRS పార్టీ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ గారు అన్నారు.ఖమ్మం నగరం 29వ డివిజన్ సుందరయ్య నగర్ లో గ్రానైట్ సంఘం జిల్లా నాయకుడు పారా నాగేశ్వర రావు గారి అధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఖమ్మం BRS నియోజకవర్గ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ గారు పాల్గొని మాట్లాడారు.

త్రీ టౌన్ లో స్వేచ్చా వాయువు ను పీల్చాలని మంచి వాతావరణం ఇవ్వాలనే ఉద్దేశంతో నే గొల్లపాడు ఛానల్ ను అభివృద్ది చేసి ఆధునీకరణ చేశామన్నారు.ఇక్కడ మార్కెట్ పై ఆధారపడ్డ వ్యాపారులు, కార్మికులు, కర్షకులు, దడవాయులు, దినసరి కులిలు ఇలా అనేక వర్గాలు జీవనోపాధి సాగిస్తున్నాయి అన్నారు.

అలాంటి వారి కడుపు నింపే మార్కెట్ ను ఇక్కడి నుండి తొలగించాలని రాజకీయ చేసింది నువ్వు కదా.. దన్ని అడ్డుకుని నేడు ఇదే మార్కెట్ ఇక్కడే ఉంచి మంత్రి అయినంక రూ.10 కోట్ల నిధులు మంజూరు చేసి అభివృద్ది చేశామని వివరించారు.గతంలో త్రీ టౌన్ అంటే పేదల నివాస ప్రాంతంగా, అభివృద్ధికి ఆమడ దూరంగా ఉండే ప్రాంతంగా పిలువబడేది గా ఉండేదని.. కానీ నేడు త్రీ టౌన్ లో వైభవం తీసుకొచ్చి అన్ని వసతులు, సౌకర్యాలు తెచ్చామని ముఖ్యంగా గోళ్ళపాడు ఛానల్ అభివృద్ది ద్వారా త్రీ టౌన్ నేడు ఖమ్మంలో అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో త్రీ టౌన్ కూడా ఉందన్నారు.

డీసీసీబీ బ్యాంక్ లో రైతుల సొమ్ము, ప్రజల సొమ్ము పంది కొక్కులు లాగా తిని బ్యాంక్ ను ముంచిటే నేడు బిసి బిడ్డ నాగభూషణం ను చైర్మన్ గా బాధ్యతలు అప్పగించి నేడు లాభాల బాటలోకి తీసుకొచ్చినం అని అన్నారు.పారా నాగేశ్వర రావు గారి అధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం, యర్రా అప్పారావు, రుద్రగాని ఉపేందర్, ముక్కాల రాజేష్, రాజేష్, పారా ఉదయ్, జాబిశెట్టి శ్రీనివాస్, 3టౌన్ ఇంఛార్జి TV బాబు, పల్లి ఉపేందర్ తదితరులు ఉన్నారు

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat