తెలంగాణలో ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు జోరుగా కొనసాగుతున్నాయి.. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేత.. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఢిల్లీలోకాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత ,శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ రావు,మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇటీవల బీఆర్ఎస్ కు చెందిన నేత నీలం మధు ముదిరాజు కూడా కాంగ్రెస్ లో చేరిన సంగతి తెల్సిందే.