మహబూబాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి శంకర్ నాయక్ గారి గెలుపును కాంక్షిస్తూ బి.ఆర్.ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్య అతిథిగా పాల్గొని మారుమూల తండా, గూడెంల నుండి వచ్చిన అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి ప్రసంగించారు…_ ఇంత భారీ సంఖ్యలో హాజరైన మిమ్మల్ని చూస్తుంటే మిత్రులు శంకర్ నాయక్ గెలుపు ఖాయమైనట్లు కనిపిస్తుందని కేసీఆర్ కార్యకర్తల్లో జోష్ నింపారు.ఎమ్మెల్యే అభ్యర్థి శంకర్ నాయక్ గారు విద్యా, ఉపాధి రంగాల్లో వెనుకబడిన మా ప్రాంతానికి మరిన్ని అవకాశాలు కల్పించి, ఎన్నికల అనంతరం మన ప్రభుత్వంలో మానుకోట గడ్డను పారిశ్రామిక కారిడార్ గా తీర్చిదిద్దాలని అందుకు మీరు మాట ఇవ్వాలని కెసిఆర్ కోరగా అందుకు స్పందిస్తూ వచ్చే ప్రభుత్వంలో మహబూబాబాద్ జిల్లాను ఉత్తమ శ్రేణి పట్టణంగా తీర్చిదిద్దుతామని సీఎం హామీ ఇచ్చారు…
ఉమ్మడి రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన ప్రాంతం మానుకోట. ఉద్యమ సమయంలో తిరుగుతూంటే కాల్వల్లో, చెరువుల్లో సర్కారు తుమ్మలు దర్శనం ఇచ్చాయి..ఒకనాడు కరువు, కాటకాలతో కటకటలాడిన తండాలు – నేడు ధన, ధాన్య రాశులతో విరాజిల్లుతున్నాయని కేసీఆర్ లంబాడాలను ఉద్దేశించి ప్రసంగించారు…కానీ ఒకప్పటి మానుకోటకు ఇప్పటి మానుకోటకు పోలిక, పొంతన లేదని ఆయన ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధిని ఉద్దేశించి ప్రసంగించారు.మనం పోరు చేసి రాష్ట్రం సాధించుకున్నాం కాబట్టే పట్టు పట్టి మహబూబాబాద్ ను జిల్లా కేంద్రంగా ఏర్పర్చుకున్నామని కేసీఆర్ ప్రజలకు వివరించారు.దేశంలో ఎక్కడా లేని విధంగా జిల్లాకో మెడికల్ కళాశాలను పెట్టుకుని అందులో భాగంగా మన గిరిజన గడ్డపై సర్కారీ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.
ఏండ్లుగా అపరిష్కృతంగా ఉన్న పోడు భూముల సమస్యకు మీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పట్టుదలతో పరిష్కరించుకుని పట్టాలు కూడా అందించిన విషయాన్ని కెసిఆర్ గుర్తుచేశారు..అలాగే ఊహించని రీతిలో జిల్లాను మరియు మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకోవడం జరిగిందని కెసిఆర్ అన్నారు…సబ్బండ వర్గాలకు సంక్షేమాన్ని అందిస్తూ మొన్ననే మ్యానిఫెస్టోను కూడా నేను విడుదల చేయడం జరిగిందని కేసీఆర్ ప్రజలకు వివరించారు…
ఇది ఎన్నికల సమయం కాబట్టి 50 ఏండ్లు రాబంద్దుల్లా మనల్ని పీడించిన కాంగ్రెసోడు అక్కస్సుతో మన దగ్గరికి దొంగ హామీలతో వస్తున్నాడు. ఆ పార్టీ కథ కర్ణాటకలో బట్ట బయలు అయింది. కాబట్టి అట్లాంటోళ్లకు మీ అమూల్యమైన ఓటు హక్కుతో బుద్ధి చెప్పి మీ ఇంటి బిడ్డ బానోత్ శంకర్ నాయక్ గెలిపించి మానుకోట సమ్మిళిత అభివృద్ధికి పాటుపడండని కెసిఆర్ ప్రజలను కోరారు.