‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాల తర్వాత మహేశ్బాబు, త్రివిక్రమ్ ముచ్చటగా మూడో చిత్రం చేయడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. సుమారు 11ఏళ్ల విరామం తర్వాత వీళ్లిద్దరూ చేస్తున్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు.
నవంబర్లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందని ఫిల్మ్నగర్ టాక్. ప్రస్తుతం మహేశ్బాబు హీరోగా నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ చిత్రీకరణ అప్పటికి పూర్తవుతుందని, ఆ వెంటనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.
ఆల్రెడీ ప్రీ-ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. శరవేగంగా జరుగుతున్నాయి. మహేశ్బాబు సరసన పూజా హెగ్డే కథానాయికగా నటించనున్న ఈ చిత్రానికి పీడీవీ ప్రసాద్ ఎగ్జిక్యూటివ్ నిర్మాత.