తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ సీఎం కేసీఆర్ ను కలిశారు. దీంతో ఆయన మళ్లీ టీఆర్ఎస్ గూటికి చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో రవీందర్ సింగ్ టీఆర్ఎస్కు రెబెల్ గా పోటీ చేశారు.
ఈ క్రమంలోనే పార్టీపై, మంత్రి గంగులపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయనకు బీజేపీ కూడా మద్దతు ఇవ్వడంతో ఆ పార్టీలో చేరతారని వార్తలొచ్చాయి. కానీ తాజాగా సీఎం కేసీఆర్ ను కలవడంతో మళ్లీ సొంత గూటికి చేరనున్నట్లు స్పష్టమవుతోంది.