తెలుగు చలన చిత్రానికి సంబంధించి ఇటీవల చంద్రబాబు సర్కార్ ప్రకటించిన నంది అవార్డులు పెద్ద దుమారాన్నే రేపాయి. ఇక నంది అవార్డుల ప్రకటన వెలువడినప్పటి నుంచి టాలీవుడ్ వర్గాల్లో కొంతమంది సమర్దిస్తుంటే మరికొంతమంది విమర్శిస్తున్నారు.
అయితే, ఇదే విషయమై ఓ ఛానెల్.. సినీ జనాల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ప్రోగ్రామ్ నిర్వహించింది. ఈ ప్రోగ్రామ్లో పాల్గొన్న సినీ విశ్లేషకుడు, నటుడు కత్తి మహేష్ చంద్రబాబు ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇవాళ నంది అవార్డ్స్ పై సోషల్ మీడియాలో జరుగుతున్న డిస్కర్షన్పై మీ అభిప్రాయమేంటని యాంకర్ ప్రశ్నించగా.. దానికి స్పందించిన కత్తి మహేష్ తనదైన శైలిలో జవాబు ఇచ్చాడు.
చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులు (2014) చాలా ప్రాబ్లమేటిక్గా ఉన్నాయన్నారు. అవార్డులకు ఎంపికైన వారే.. అవార్డుల కమిటీకి మెంబర్గా ఉండటం కన్నా దారుణమైన విషయం మరొకటి ఉండదంటూ.. బాలకృష్ణపై పంచ్ వేశారు. ఒకవేళ మీరు అవార్డుల కమిటీకి మెంబర్గా ఉంటారా..? అంటూ కత్తి మహేష్ యాంకర్ను ప్రశ్నించగా.. ఉండకూడదు, ఒక వేళ ఉన్నా టేబుల్ కిందకు వెళ్లి దాక్కోవాలి యాంకర్ జవాబిచ్చింది. కనీసం ఆ డిజైనింగ్ అనేది ఉండాలి అంటూ పేర్కొన్నారు.
లెజెండ్ ఒక అప్రజాస్వామిక ప్యూడల్ భావాల్ని, భావజాలాన్ని పెంపొందించే సినిమా. ఆ సినిమాకు కూడా అవార్డు రావడంకంటే మరొక దారుణం ఉండదన్నారు. ఏమన్నా అంటే.. లెజెండ్ సినిమాలో బ్రూణ హత్యల సీనేదో ఉందట.. అందుకే ఇచ్చామని చెప్పుకుంటున్నారంటూ, ఇప్పుడు నేనూ.. చంద్రబాబును పొగిడేస్తే నాకు నంది అవార్డు ఇస్తారోమో!? అంటూ తనదైన శైలిలో చంద్రబాబు ప్రభుత్వాన్ని ఎద్దేవ చేశారు కత్తి మహేష్.