కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలో చింతల్ లోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద నాయి బ్రాహ్మణ సంక్షేమానికి పెద్దపీట వేస్తూ వారి ఆత్మ గౌరవాన్ని పెంపొందించిన బిఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారికి కృతజ్ఞతగా మద్దతు తెలుపుతూ నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో కుత్బుల్లాపూర్ నియోజక వర్గం నాయి బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు ఏకగ్రీవ తీర్మానం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో నాయి బ్రాహ్మణ సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అందులో భాగంగానే నాయి బ్రాహ్మణ సంక్షేమ భవనానికి నియోజకవర్గంలో స్థలం కేటాయించడం జరిగిందని. నాయి బ్రాహ్మణుల అభివృద్ధికై 250 యూనిట్ల ఉచిత విద్యుత్, పన్ను మినహాయింపు చేసిన ఏకైక ప్రభుత్వం బిఆర్ఎస్ యేనన్నారు. అంతేకాక బీసీ బందు ద్వారా నియోజకవర్గంలోని 150 మందికి బీసీ బంధు ద్వారా ఒక్కొక్కరికి లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి వారిని ప్రోత్సహించిన ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వమేదేనన్నారు. నాయి బ్రాహ్మణుల అభ్యున్నతి కోసం నిరంతరం పనిచేసే బిఆర్ఎస్ పార్టీని నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించి హ్యాట్రిక్ విజయాన్ని కట్టబెట్టాలన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రావుల శేషగిరిరావు, మాజీ కార్పొరేటర్ బొడ్డు వెంకటేశ్వరరావు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ టీ లక్ష్మారెడ్డి, బిఅర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
నాయి బ్రాహ్మణ సేవా సంఘం కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అధ్యక్షులు రేనయ్య నాయి, చైర్మన్ ఎస్. రవి బాబు నాయి, ప్రధాన కార్యదర్శి పరమేష్ నాయి, వర్కింగ్ ప్రెసిడెంట్ బండారు సురేష్ నాయి, మాజీ అధ్యక్షులు గడిల వెంకటేశ్వర్లు, కోశాధికారి మహేందర్ నాయి, రవీందర్ నాయి, మైలారం యాదగిరి, వాసు, బిఎస్ఆర్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు.