ఏపీ అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీలో రాజకీయ సంక్షోభం రోజు రోజుకి పెరిగిపోతుంది .ఈ క్రమంలో గత మూడున్నర ఏండ్లుగా టీడీపీ సర్కారు చేస్తోన్న పలు అవినీతి అక్రమాలకు విసుగు చెందో లేదా పార్టీలో ..ప్రభుత్వంలో సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడమో ..లేదా పార్టీ అధికారంలో ఉన్న కూడా ప్రజలకు ఏమి చేయలేకపోవడమో ..కారణం ఏది ఎం,ఏమైనా కానీ ఆ పార్టీకి ఒకరు తర్వాత మరొకరు గుడ్ బై చెప్తున్నారు .ఈ క్రమంలో ఇప్పటికే టీడీపీ మాజీ ఎంపీ చిమట సాంబు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు .అంతకంటే ముందు టీడీపీ సీనియర్ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఇటీవల ఎంపీ పదవికి రాజీనామా చేస్తాను అని ప్రకటించేశారు .
తాజాగా మరో సీనియర్ ఎంపీ తన ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నారు అని వార్తలు వస్తోన్నాయి .ఏపీ నుండి సీనియర్ మోస్ట్ ఎంపీ అయిన రాయపాటి సాంబశివరావు తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తాను ఇటీవల ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే .త్వరలో భర్తీ కానున్న టీటీడీ ఛైర్మన్ పదవి కోసం రాయపాటి గత మూడున్నర ఏండ్లుగా బాబు చుట్టూ చక్కర్లు కొడుతున్న సంగతి విదితమే .దీనికోసం ఆయన పెద్ద ఎత్తున లాబియింగ్ కూడా జరిపారు .
కానీ చంద్రబాబు రాయపాటి విన్నపాలను పక్కన పెట్టి రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి అయిన యనమల రామకృష్ణుడు వియంకుడు అయిన పుట్టా సుధాకర్ యాదవ్ కు టీటీడీ ఛైర్మన్ పదవి ఇవ్వాలని నిర్ణయించారు .దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన గుంటూరు టీడీపీ సీనియర్ ఎంపీ రాయపాటి సాంబశివరావు తన ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నట్లు గుంటూరు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి .అయితే గతంలోనే ఆయన టీటీడీ ఛైర్మన్ పదవి రాకపోతే పార్టీ పదవికి రాజీనామా చేస్తాను ఆయన ప్రకటించారు .ఐదు సార్లు ఎంపీగా పార్లమెంట్ లో అడుగు పెట్టిన ఆయన గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరి ఎంపీగా గెలిచారు .తాజాగా ఆయనకు టీటీడీ ఛైర్మన్ పదవి రాకపోవడంతో ఆయన తీవ్ర మనస్థాపానికి గురై పదవికి రాజీనామా చేయాలనీ నిర్ణయించుకున్నట్లు రాయపాటి వర్గీయులు అంటున్నారు .చూడాలి మరి రాయపాటి ఏ నిర్ణయం తీసుకుంటాడో ..?