ఆయన ఒక యువనేత .. దాదాపు ఎనిమిది ఏళ్ళ నుండి నీతి నిజాయితీ విలువలు అంటూ నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చిన కానీ గడ్డి పరకతో సమానం అంటూ వదిలేసిన ఐదున్నర కోట్ల ఆంధ్రుల మనస్సును గెలుచుకున్న దేశంలోనే అత్యంత యువ ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత వైఎస్ జగన్ .ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు గత నాలుగు సంవత్సరాలుగా జగన్ పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వంపై వైసీపీ ఎంపీలతో లోక్సభలో అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించారు.
see also :”పవన్ కల్యాణ్ కొత్త కథ”కు స్ర్ర్కీన్ప్లే ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..!!
అయితే కేంద్ర ప్రభుత్వంపై వైసీపీ ప్రవేశపెట్టబోతున్న అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని అధికార టీడీపీ పార్టీ నిర్ణయి౦చింది . మంత్రులు, పార్టీ కీలక నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వైసీపీ పెట్టే అవిశ్వాసానికి మనమెందుకు మద్దతు ఇవ్వాలని కొందరు మంత్రులు సీఎంను ప్రశ్నించగా.. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన ఏ అంశానికైనా మద్దతు ఇచ్చేందుకు టీడీపీ రెడీగా ఉండాలని బాబు సూచించినట్లు సమాచారం.
see also :2019 వైసీపీ అధికారంలోకి రావలి ..టీడీపీ వస్తే దోపిడీలు, భూకబ్జాలే…పవన్ కళ్యాణ్