…దాదాపు మూడు రోజుల తర్వాత కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో ఎవరు ఊహించని సంఘటన చోటు చేసుకుంది.ఇటివల వెలువడిన కర్ణాటక రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ పార్టీ నూటనాలుగు ,కాంగ్రెస్ పార్టీ డెబ్బై ఎనిమిది ,జేడీఎస్ పార్టీ ముప్పై ఎనిమిది ,ఇతరులు రెండు స్థానాల్లో గెలుపొందిన సంగతి తెల్సిందే .
అయితే ఎన్నికలలో అత్యధిక స్థానాలను గెలుపొందిన బీజేపీ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించడంతో గవర్నర్ వాజ్ భాయ్ బీజేపీ పక్ష నేత యడ్యూరప్పను ముఖ్యమంత్రిగా పదవి ప్రమాణ స్వీకారం చేయించారు .
అయితే ఈ రోజు కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీలో బలం నిరుపించుకోకపోవడంతో మూడు రోజుల ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు యడ్డీ .దీంతో కాంగ్రెస్ ,జేడీఎస్ కల్సి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని మీడియా సమావేశంలో ప్రకటించాయి …