Home / 18+ / చెన్నైలో టీడీపీ నేత‌ల ప‌చ్చ‌ భాగోతం బ‌ట్ట‌బ‌య‌లు..!

చెన్నైలో టీడీపీ నేత‌ల ప‌చ్చ‌ భాగోతం బ‌ట్ట‌బ‌య‌లు..!

వ్య‌క్తిగ‌త స‌మాచార గోప్య‌త‌పై తీవ్ర ఆందోళ‌న చెల‌రేగుతున్న వేళ త‌మిళ‌నాడు తెలుగుదేశం పార్టీ ఫోరం నేత‌లు ఘ‌రానా మోసం బ‌య‌ట ప‌డింది. ప్ర‌భుత్వ స‌ర్వ‌ర్ల‌ను హ్యాక్ చేసి, స‌మాచారాన్ని చోరీ చేసిన ముగ్గురు టీడీపీ ఫోరం నేత‌లు అడ్డంగా దొరికిపోయారు. డేటాను చోరీ చేయ‌డ‌మే కాకుండా మార్కుల‌ను పెంచుతామంటూ విద్యార్థుల‌ను మోసం చేసిన కేసులో టీడీపీ ఫోరం నేత‌లు వెంక‌ట్రావు, న‌వీన్ చౌద‌రి, సుధాక‌ర్‌ల‌ను చెన్నైపోలీసులు అరెస్టు చేశారు. అనంత‌రం వారిని పుల్ల‌ల్ సెంట్ర‌ల్ జైలుకు త‌ర‌లించారు. ఈ ముగ్గురు టీడీపీ నేత‌లు త‌మిళ‌నాడు ప్ర‌భుత్వ స‌ర్వ‌ర్ల‌ను హ్యాక్ చేసి డేటాను చోరీ చేసిన‌ట్టుగా పోలీసులు గుర్తించారు.

అయితే, అరెస్టైన ముగ్గురు టీడీపీ నేత‌లు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు, ఆయ‌న కుమారుడు, ఐటీశాఖ మంత్రి నారా లోకేష్‌కు అత్యంత స‌న్నిహితులు కావ‌డం గ‌మ‌నార్హం. టీడీపీ నేత‌ల‌పై 420, 120బీ, ఐటీ యాక్ట్‌, 66బీ కేసులు న‌మోదు చేసిన‌ట్టు పోలీసులు తెలిపారు.

మీకు ఎస్ఎస్‌సీలో 400 మార్కులే వ‌చ్చాయా..? ఆ మార్కులు 500లు దాటాల‌నుకుంటున్నారా..? అయితే, మా ద‌గ్గ‌ర‌కు రండి. మంచి అవ‌కాశం, మించిన దొర‌క‌దు.. జ‌స్ట్ కొంత న‌గ‌దు ఇస్తే చాలు అంటూ త‌మిళ‌నాడు టీడీపీ ఫోరం నేత‌లు ఘ‌రానా మోసానికిపాల్ప‌డ్డారు. డ‌బ్బులు ఇవ్వండి.. మార్కులు పెంచుకోండి అంటూ విద్యార్థుల‌ను బురిడీ కొట్టించిన టీడీపీ నేత‌లు ల‌క్ష‌లాది రూపాయ‌లు దండుకున్నారు. తీరా మోసం బ‌య‌ట‌ప‌డేస‌రికి క‌ట‌క‌టాలు లెక్క‌పెడుతున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat