Home / ANDHRAPRADESH / వైసీపీ వైపు చూస్తోన్న టీడీపీ మాజీ ఎంపీ..!

వైసీపీ వైపు చూస్తోన్న టీడీపీ మాజీ ఎంపీ..!

నవ్యాంధ్ర అధికార వైసీపీ పార్టీలోకి వలసలు ప్రారంభం కానున్నాయా..?. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన ఎంపీలు కేంద్ర అధికార పార్టీ బీజేపీలో చేరిన సంగతి తెల్సిందే. తాజాగా ఆ పార్టీకి చెందిన మాజీ ఎంపీ ఒకరు వైసీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారని ఆర్ధమవుతుంది.

టీడీపీకి చెందిన మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఈ రోజు శుక్రవారం తిరుమల తిరుపతిలో శ్రీనివాసుడ్ని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ”గత రెండు నెలలుగా వైసీపీ పాలన బాగుంది. నవరత్నాలు అమలు చేయడానికి నిధులు కొరత ఉంది. అయిన కానీ వైసీపీ సర్కారు పథకాలను అమలుచేయడం లో కనబరుస్తున్న విధానం బాగుంది.

ముఖ్యమంత్రిగా జగన్ మంచి మార్కులు తెచ్చుకుంటున్నారు అని ఆయన వ్యాఖ్యానించారు. అయితే జగన్ సర్కారుపై ప్రశంసల వరకు ఒకే కానీ ఆయన పార్టీ మారనున్నట్లు.. త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తాను అని ఆయన వ్యాఖ్యనించడం పార్టీ మారడం ఖాయమని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే వైసీపీలో చేరడానికే రాయపాటి ఇలాంటి వ్యాఖ్యలు చేశారని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు.చూడాలి మరి రాయపాటి చూపు వైసీపీలోకా.. లేదా వేరే పార్టీలోకా..?

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat