Home / ANDHRAPRADESH / టీడీపీ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

టీడీపీ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

టీడీపీకి చెందిన సీనియర్ నేత,మాజీ ఎమ్మెల్యే గుండెపోటుతో తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఏపీలోని గుంటూరు జిల్లా బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గం నుండి 1994-99 మధ్య కాలంలో ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించిన ముప్పలనేని శేషగిరిరావు ఈ రోజు మృతి చెందారు. ఆయన 1982-84మధ్య కాలంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు.

టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు,మాజీ దివంగత ముఖ్యమంత్రి ,ప్రముఖ నటుడు నందమూరి తారకరామారావు పిలుపుతో ఆయన టీడీపీలో చేరి బాపట్ల నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారు.

ఆయన మృతిపట్ల టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. ఆయన కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే మృతి పట్ల టీడీపీ నేతలు ,పలువురు సంతాపం వ్యక్తం చేస్తోన్నారు.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat