దేశమంతా దిశ గురించి చర్చించుకుంటుంటే చంద్రబాబు మాత్రం ఆ చర్చకు అడ్డుపడుతున్నారు. సోమవారం నాడు ఏపీ అసెంబ్లీలో శీతాకాల సమావేశంలో భాగంగా మహిళా రక్షణ గురించి చర్చ జరుగుతుంటే అది జరగకుండా చంద్రబాబు అడ్డుపడ్డారు. దీనిపై ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై విజయసాయి రెడ్డి ఘాటుగా స్పందించాడు.”అత్యాచారాలపై దేశమంతా అట్టుడికిపోతుంటే మహిళా రక్షణ గురించి అసెంబ్లీలో చర్చ జరక్కుండా అడ్డుపడిన చంద్రబాబు ఉల్లి ధరలపై కన్నీళ్ళు పెట్టుకోవడంలో ఆశ్చర్యమేముంది. ఆయన ఐదేళ్ల పాలనలో కాల్ మనీ సెక్స్ రాకెట్తోపాటు పచ్చ చొక్కాల చెరలో చిక్కి అల్లాడిన మహిళలు ఉదంతాలు కోకొల్లలు” అని అన్నారు. ఆయన అధికారంలో ఉన్న అన్నిరోజులు పచ్చ చొక్కాల అండతో వారి ప్రోత్సహంతోనే అన్ని జరిగాయి. అలాంటిది ఇప్పుడు చంద్రబాబు ఇలా మాట్లాడడం ఏంటో మరి.
