పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఆ నిర్ణయం ఏమిటీ అనేది తెలిస్తే అందరు షాక్ అవ్వక తప్పదు. ఇంతకు అసలు విషయానికి వస్తే రేణు పవన్ కళ్యాణ్ తో కలిసి ప్రయాణం చెయ్యలనుకుంటుందని సమాచారం. దీనికి పవన్ కళ్యాణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. బద్రి సినిమా తరువాత లవ్ లో పడి ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. కొన్ని అనివార్య కారణాలు వల్ల ఇద్దరూ విడిపోయారు. ఆ తరువాత పవన్ కళ్యాణ్ వేరే పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు చాలా రోజుల తరువాత వీరిద్దరూ కలవనున్నారు అనే వార్తలు వస్తున్నాయి. ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇక పవన్ కళ్యాణ్ వరుసగా మూడు సినిమాలు తీయనున్నాడు. ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్ పింక్ రీమెక్ తీస్తున్న విషయం తెలిసిందే. దీనికి వకీల్ షాబ్ అనే టైటిల్ పెట్టాలని నిర్నయించినట్లు తెలుస్తుంది. ఇందులో రేణు దేశాయ్ నటిస్తుందని సమాచారం.
