Home / ANDHRAPRADESH / చిట్టినాయుడూ కాగితాలు భద్రంగా దాచుకో..త్వరలో వ్యాపారం పెట్టుకోవచ్చు !

చిట్టినాయుడూ కాగితాలు భద్రంగా దాచుకో..త్వరలో వ్యాపారం పెట్టుకోవచ్చు !

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్‌పై జరిపిన ఐటీ దాడుల్లో  2 వేల కోట్ల మేర అక్రమలావాదేవీలు జరిగాయని,  హవాలా, మనీలాండరింగ్ ద్వారా వేల కోట్ల అవినీతి జరిగిందని ఐటీ శాఖ చెప్పిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ మొత్తంలో చంద్రబాబు మరియు లోకేష్ హస్తం ఉన్నట్టు తెలుస్తుంది. ఇది ఇలా ఉండగా తాజాగా నారా లోకేష్ వారి ఆస్తుల వివరాల గురించి ప్రకటించాడు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో తమ కుటుంబ ఆస్తులను మీడియా ముందు పెట్టాడు. మా నాన్న గారి ఆస్తి 9 కోట్ల రూపాయలని, అప్పులు 5.13 కోట్లు అని చెప్పడం జరిగింది. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి “తండ్రేమో తన ఆస్థి లక్ష కోట్లని వేల మంది సాక్షిగా ప్రకటించాడు. చిట్టినాయుడేమో ఆస్థుల వివరాలంటూ, ఎండాకాలంలో లేచే సుడిగాలిలా అందరి కళ్లలో దుమ్ముకొడతాడు. ఈ ఐదేళ్లలో ఎంత నొక్కేసిందీ త్వరలోనే బయట పడుతుంది. అప్పుటిదాకా ఆ కాయితాలు భద్రంగా దాచుకో చిట్టీ” అని అన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat