తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 163 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,97,113కి చేరింది. ఇందులో 1,700 యాక్టివ్ కేసులు ఉండగా.. 658 మంది హోం ఐసోలేషన్లో ఉన్నారు.
ఇప్పటివరకు 2,93,791 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా కరోనాతో ఇద్దరు చనిపోగా మొత్తం మృతుల సంఖ్య 1,622కి చేరింది.