ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్(KMC) ఎన్నికల్లో 18వ డివిజన్ నుండి కాంగ్రెస్ పార్టీ నుండి బరిలో ఉన్న అభ్యర్థిని అయినాల పద్మ, భర్త శ్రీనివాసరావు తో పాటు 150 మంది కార్యకర్తలు స్థానిక తెరాస అభ్యర్థి మందడపు లక్ష్మీ మనోహర్ ఆధ్వర్యంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి సమక్షంలో తెరాసలో చేరారు.
వారికి పార్టీ కండువా కప్పు సాదరంగా ఆహ్వానించారు. అభివృద్ధికి చిరునామా గా ఉన్న తెరాస పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేయడానికి మనస్సు రాలేదని అభివృద్ధిని కాంక్షించే వ్యక్తిగా తెరాసతో నడుస్తామని పద్మ పేర్కొన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెరాసలో చేరుతున్నట్లు ప్రకటించారు.
తమతో పాటు కలిసి నడిచేందుకు తెరాస పార్టీలో చేరుతున్నందుకు మంత్రి పువ్వాడ హర్షం వ్యక్తం చేశారు. ఇదే స్ఫూర్తితో ఎన్నికల్లో తెరాస అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు కోరారు.