Home / rameshbabu (page 921)

rameshbabu

రెండు పడకల ఇండ్ల పథకానికి మరోసారి విశిష్ఠ గుర్తింపు

తెలంగాణ రాష్ట్రంలోని పేదలు ఆత్మగౌరవంతో జీవించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రెండు పడకల ఇండ్ల పథకానికి మరోసారి విశిష్ఠ గుర్తింపు లభించింది. కొల్లూరు-2లో నిర్మించిన రెండు పడకల ఇండ్ల కాలనీకి పట్టణ నిరుపేద గృహాలు, మౌలిక వసతుల పథకం కింద జాతీయస్థాయిలో నిర్వహించిన పోటీలో బెస్ట్‌ ప్రాక్టీస్‌ అవార్డు లభించింది. శుక్రవారం హైదరాబాద్‌లో హడ్కో హైదరాబాద్‌ ప్రాంతీయ కార్యాలయం సంయుక్త జనరల్‌ మేనేజర్‌ (ప్రాజెక్ట్స్‌) మురళీకృష్ణ …

Read More »

డ‌బుల్ డెక్క‌ర్ బ‌స్సుల‌పై మంత్రి కేటీఆర్ ట్వీట్

ఒక‌ప్పుడు భాగ్య‌న‌గ‌రంలో డ‌బుల్ డెక్క‌ర్ బ‌స్సులు ప‌రుగెడుతుంటే చూడ‌ముచ్చ‌ట‌గా ఉండేది. నిజాం కాలం‌లో ప్రారంభ‌మైన డ‌బుల్ డెక్క‌ర్ బ‌స్సులు కాల‌క్ర‌మేణా క‌నుమరుగై పోయాయి. అయితే షాకీర్ హుస్సేన్ అనే యువ‌కుడు డ‌బుల్ డెక్క‌ర్ బ‌స్సుల‌ను గుర్తు చేస్తూ ఐటీ మినిస్ట‌ర్ కేటీఆర్‌కు ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. ఒక‌ప్పుడు డ‌బుల్ డెక్క‌ర్ బ‌స్సు సికింద్రాబాద్ నుంచి జూపార్క్ మార్గంలో 7 నంబ‌ర్‌తో న‌డిచేవి. జూపార్క్ నుంచి హైకోర్టు, అఫ్జ‌ల్‌గంజ్‌, అబిడ్స్‌, …

Read More »

తెలంగాణలో 1,607 కొత్త కరోనా కేసులు

తెలంగాణలో గత నాలుగు రోజుల నుంచి కరోనా కేసులు పెరుగుతున్నాయి.  గడిచిన 24 గంటల్లో 1,607 కరోనా కేసులు నమోదు అయ్యాయి.. ఆరుగురు మృతి చెందారు. దీంతో మొత్తం ఇప్పటి వరకు పాజిటీవ్ కేసుల సంఖ్య 2,48,891కి చేరింది. 1,372 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 19,936 యాక్టివ్ కేసులుండగా.. చికిత్స నుంచి కోలుకుని 2,27,583 మంది డిశ్చార్జ్ అయ్యారని  రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శనివారం విడుదల చేసిన హెల్త్ …

Read More »

తెలుగు చిత్రపరిశ్రమపై పూజా హెగ్డే సంచలన వ్యాఖ్యలు

తనను స్టార్‌ హీరోయిన్‌గా నిలబెట్టిన తెలుగు చిత్రపరిశ్రమపై పూజా హెగ్డే సంచలన వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది వాళ్లు నడుం  మత్తులో ఉంటారనీ,  మిడ్‌ డ్రెస్‌లలోనే నాయికల్ని చూడాలనుకుంటారనీ  శుక్రవారం ఓ ఇంటర్వ్యూలో పూజ చెప్పారు. హీరోలకు సమానంగా  హీరోయిన్లకు  పారితోషికం ఇవ్వాలని కూడా  ఆమె డిమాండ్‌ చేశారు. ఆమె వ్యాఖ్యలు నెట్టింట్లో పెద్ద దుమారాన్నే రేపాయి. దక్షిణాది సినిమాల  వల్ల హీరోయిన్‌గా రాణిస్తూ డబ్బులు సంపాదిస్తున్న పూజ  ఇలా మాట్లాడడం …

Read More »

రూపం మార్చుకున్న కరోనా వైరస్

కరోనా వైరస్‌లో కొత్త మార్పులు చోటు చేసుకొన్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ మార్పులతో వైరస్‌ విస్తృతంగా వ్యాపిస్తే అభివృద్ధి చేస్తున్న టీకాలు పనిచేయవనే భయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. డెన్మార్క్‌లో మింక్‌ అనే జీవి నుంచి ఈ వైరస్‌ మనుషులకు వ్యాపిస్తున్నట్లు గుర్తించారు. ఆ దేశానికి చెందిన ది స్టేటెన్స్‌ సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఈ విషయాన్ని గుర్తించింది. దీంతో అప్రమత్తమైన డెన్మార్క్‌ ప్రభుత్వం దేశంలోని ఉత్తర జూట్‌ల్యాండ్‌ మున్సిపాలిటీల్లో కొత్త ఆంక్షలను …

Read More »

తెలంగాణ ఈసీకి హైకోర్టు ఆదేశాలు

తెలంగాణలో పట్టభద్రుల ఓటు నమోదు గడువు పెంచాలని ఎన్నికల కమిషన్‌కు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు స్పందనగా.. న్యాయస్థానం ఆదేశాలను అమలు చేస్తామని, డిసెంబరు 1 నుంచి 31 వరకు ఓటు నమోదు అవకాశం కల్పిస్తామని ఈసీ, కోర్టుకు తెలిపింది. ఈ మేరకు కొత్తగా మరో నోటిఫికేషన్‌ జారీచేస్తామని వెల్లడించింది. కాగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో పట్టభద్రుల ఓటు నమోదు గడువును డిసెంబరు 7 వరకు గడువు …

Read More »

దేశ చరిత్రలోనే సీఎం జగన్ గొప్ప నిర్ణయం

మహిళా ఖైదీల విషయంలో దేశ చరిత్రలోనే సీఎం జగన్ గొప్ప నిర్ణయం తీసుకున్నారని హోమ్‌ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మహిళా ఖైదీల విషయంలో సీఎం జగన్ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. 5 ఏళ్ల పాటు శిక్ష పూర్తి చేసుకున్న వారిని విడుదల చేయాలని నిర్ణయించారు. జైల్లో ఉన్న మహిళా ఖైదీలకు వివిధ వృత్తులపై శిక్షణ ఇస్తున్నాము. వారు బయటకు వచ్చిన …

Read More »

మలేరియా బారిన పడిన టాలీవుడ్ నటి

తాను కోలుకుంటున్నానని, తన ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నటి కృతి కర్బందా తన అభిమానులకు తెలిపారు. తనపై అనంతమైన ప్రేమ కురిపిస్తూ, ఎల్లప్పుడూ అండగా ఉంటున్నందుకు శ్రేయోలాభిషులు, సన్నిహితులకు ధన్యవాదాలు తెలిపారు. 2020 తనకు ఎన్నో విషయాలు నేర్పిందంటూ సోషల్‌ మీడియాలో ఓ భావోద్వేగ లేఖను పంచుకున్నారు. కాగా కృతి కర్బందా ఇటీవల మలేరియా బారిన పడ్డారు. ఇప్పుడిప్పుడే అనారోగ్యం నుంచి కోలుకుంటున్న ఆమె.. ఫన్నీ …

Read More »

తెలంగాణలో అమెజాను భారీ పెట్టుబడి

ప్రపంచ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ తెలంగాణలో భారీ పెట్టుబడులకు శ్రీకారం చుట్టింది. రికార్డు స్థాయిలో రూ. 20 వేల 761కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. 2022 నాటికి హైదరబాద్‌లో అమెజాన్ వెబ్ సర్వీసెస్‌ను ప్రారంభించనుందని తెలంగాణా ఐటీ శాఖామంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. పలు చర్చల తర్వాత ఏవీఎస్ పెట్టుబడులకు ముందుకు వచ్చిందనీ, మల్టిపుల్ డేటా సెంటర్లను అమెజాన్ ఏర్పాటు చేయనుందని వెల్లడించారు. ఇదే అతిపెద్ద ఎఫ్‌డీఐ ఇన్వెస్ట్‌మెంట్ అంటూ …

Read More »

అడ్డంకులున్నా.. ఆగని పోలవరం..

తాను సాధించని పనులను జగన్ చేస్తున్నాడనే పగ.. చేయనీయకుండా చేయాలని అడ్డంకులు.. చేతిలో మీడియా.. కోర్టుల్లో పిటీషన్లు.. ఇలా ప్రతిపక్షం ఎంత అడ్డుకోవాలని చూస్తున్నా ఏపీ కలల ప్రాజెక్ట్ పనులు మాత్రం ఆగడం లేదు. పని ఆగిపోయేందుకు ఎన్ని కుట్రలు సాగుతున్నప్పటికీ పోలవరం ప్రాజెక్ట్ పనులు లక్ష్యం దిశగా వెళుతున్నాయి. వరదలు వచ్చినా, తుఫానులు అల్లకల్లోలం సష్టించినా, కోవిడ్ మహమ్మారి భయపడెతున్నా అక్కడ మాత్రం పనులు ఆగడం లేదు. రేయింబవళ్లు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat