శివసేన సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ ఇంటిపై ఈడీ అధికారులు దాడి చేశారు. పత్రాచల్ కేసులో ఆధారాల కోసం ఆదివారం ఉదయం నుంచి ముంబైలోని ఆయన ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. మనీలాండరింగ్కు సంబంధించి సంజయ్రౌత్ను వించారించే అవకాశం ఉందని ఈడీ వర్గాలు వెల్లడించాయి. Mumbai | Enforcement Directorate officials at Shiv Sena leader Sanjay Raut's residence, in connection with Patra Chawl …
Read More »Blog Layout
అమెరికా అధ్యక్షుడు బైడెన్ కు మళ్లీ కరోనా
అమెరికా అధ్యక్షుడు బైడెన్ మళ్లీ కరోనా బారినపడ్డారు. కోవిడ్ నుంచి కోలుకున్నట్లు అధ్యక్ష భవనం వైట్ హౌస్ ప్రకటించిన మూడు రోజుల్లోనే.. వ్యాధి మళ్లీ ఆయనకు తిరగబెట్టింది. దీంతో మరోమారు ఆయన ఏకాంతంలోకి వెళ్లారు. అయితే బైడెన్ కు స్వల్ప లక్షణాలే ఉన్నాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైట్ హౌస్ డాక్టర్ కెవిన్ తెలిపారు.
Read More »దేశంలో తగ్గిన కరోనా కేసులు
దేశంలో మరోసారి కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గత నాలుగు రోజులుగా 20 వేలకుపైగా నమోదవుతున్న రోజువారీ పాజిటివ్ కేసులు తాజాగా 19,673కు చేరాయి. దీంతో మొత్తం కేసులు 4,40,19,811కు చేరాయి. ఇందులో 4,33,49,778 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు కరోనాతో 5,26,357 మంది మరణించారు. మరో 1,43,676 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇక గత 24 గంటల్లో కొత్తగా 45 మంది మృతిచెందగా, 19,336 మంది …
Read More »చూపులతోనే చంపేస్తున్న అనన్య నాగళ్ల
ప్రభాస్ అభిమానులకు Bad News
గతంలో బాహుబలి సినిమా షూటింగ్ సందర్భంగా గాయపడ్డ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గతంలో యూరప్ లో మోకాలికి సర్జరీ చేయించుకున్న విషయం సినిమా ప్రేక్షకులందరికీ తెలిసిందే. ఆ తర్వాత షూటింగ్ స్టంట్స్ లో పాల్గొన్నాడు.. అయితే తాజాగా ఆ గాయం తిరగబెట్టడంతో ఇటీవల మళ్లీ యూరప్ వెళ్లాడు. అయితే ప్రభాస్ ను పరీక్షించిన వైద్యులు 10 రోజులు రెస్ట్ తీసుకోమని సూచించినట్లు సమాచారం. దీంతో ఆ తర్వాతే ప్రభాస్ …
Read More »Ys Sharmila YSRTP పార్టీ పెట్టడం వెనక అసలు కారణం చెప్పిన డీకే అరుణ
Ys Sharmila YSRTP పార్టీ పెట్టడం వెనక అసలు కారణం ఎంటో చెప్పారు మాజీ మంత్రి,బీజేపీ నేత డీకే ఆరుణ . ఆమె మీడియా తో మాట్లాడుతూ “కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఏపీ ముఖ్యమంత్రి,వైసీపీ అధినేత జగన్,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మధ్య అవగాహన ఉంది.. ఎన్నికల సమయంలో మాత్రమే వారు ఓట్ల కోసం వ్యతిరేక ధోరణితో వ్యవహరిస్తారని ఆమె వ్యాఖ్యానించారు. పోలవరం ముంపు గ్రామాల్లో కనీస వసతులు …
Read More »ఆగస్టు 2 న పింగళి పేరిట తపాల స్టాంప్ విడుదల
జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య శత జయంతివేడుకల సందర్భంగా ఆగస్టు 2 న ఢిల్లీ వేదికగా పెద్ద ఎత్తున కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని కేంద్ర సాంస్కృతిక మంత్రి కిషన్రెడ్డి తెలిపారు. విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పింగళి రూపొందించిన ఒరిజనల్ జెండాను ఆరోజున ప్రదర్శించనున్నామని పేర్కొన్నారు. ఇవాళ పింగళి వెంకయ్య స్వగ్రామాన్ని సందర్శిస్తున్నానని వివరించారు.శత జయంతి వేడుకలకు పింగళి సభ్యులను ప్రధాని తరుఫున ఢిల్లీకి ఆహ్వానిస్తున్నట్లు, …
Read More »బీజేపీ నేతకు కళ్యాణ లక్ష్మీ చెక్కు అందజేత
సీఎం కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న కల్యాణలక్ష్మి పథకం రాష్ట్రంలో పార్టీలకతీతంగా అమలవుతున్నది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బస్వాపూర్లో బీజేపీ నేత పొన్నం శ్రీనివాస్ గౌడ్కు కల్యాణ లక్ష్మి చెక్కు ను ఆదివారం టీఆర్ఎస్ నేతలు అందజేశారు. వివరాల్లోకి వెళ్తే.. పొన్నం శ్రీనివాస్ గౌడ్ కూతురు వివాహం ఇటీవలే జరిగింది. కాగా, శ్రీనివాస్ భార్య వాణి పేరిట కల్యాణ లక్ష్మి పథకం ద్వారా రూ.1,00,116 …
Read More »తెలంగాణ ప్రజలకు మంత్రి హరీష్ రావు వినూత్న పిలుపు
మన ఆరోగ్యం మన చేతిలోనే ఉందని తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీవ్ రావు అన్నారు. డెంగీ నివారణలో భాగంగా.. మంత్రి తన నివాస ప్రాంగణంలో పారిశుధ్య కార్యక్రమం నిర్వహించారు. మంత్రి తన ఇంటి చుట్టూ పరిసర ప్రాంతాలను స్వయంగా ఆయనే శుభ్రపరిచారు. దోమలు రాకుండా నిల్వ ఉన్న నీటిని తొలగించారు.మొక్కల తొట్లను క్లీన్ చేశారు. ప్రజలంతా ఇంట్లో నీళ్లు నిలిచే ప్రదేశాలను శుభ్రం చేసుకోవాలని సూచించారు. …
Read More »హరితేజ డ్రస్సింగ్పై నెగిటివ్ కామెంట్స్.. నటి దిమ్మతిరిగే కౌంటర్!
బిగ్బాస్ బ్యూటీ హరితేజ ప్రస్తుతం బెల్జియంలో ఎంజాయ్ చేస్తుంది. అక్కడి అప్డేట్స్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంటుంది. తాజాగా అక్కడి వీధుల్లో షార్ట్ డ్రస్లో డాన్స్ చేస్తూ ఓ వీడియోను పోస్ట్ చేసింది. దీన్ని నెటిజన్లు తెగ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై తన దైన శైలిలో దిమ్మతిరిగే కౌంటర్ వేసింది హరితేజ. హరితేజ వెకేషన్ను ఎంజాయ్ చేస్తూ ఓ షార్ట్ డ్రస్తో చేసిన డాన్స్ వీడియోను సోషల్ మీడియాలో …
Read More »