Ys Sharmila YSRTP పార్టీ పెట్టడం వెనక అసలు కారణం ఎంటో చెప్పారు మాజీ మంత్రి,బీజేపీ నేత డీకే ఆరుణ . ఆమె మీడియా తో మాట్లాడుతూ “కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఏపీ ముఖ్యమంత్రి,వైసీపీ అధినేత జగన్,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మధ్య అవగాహన ఉంది..
ఎన్నికల సమయంలో మాత్రమే వారు ఓట్ల కోసం వ్యతిరేక ధోరణితో వ్యవహరిస్తారని ఆమె వ్యాఖ్యానించారు. పోలవరం ముంపు గ్రామాల్లో కనీస వసతులు కల్పించలేదని.. అందుకే వారు తెలంగాణలో కలవాలని అనుకుంటున్నారన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఆ గ్రామాలను తెలంగాణలో కలుపుతామన్నారు. వైఎస్ కుటుంబంలో విభేదాలతోనే షర్మిల పార్టీ పెట్టారని పేర్కొన్నారు.