ఎన్ని తప్పుడు పనులు చేసినా, ఎంత అవినీతికి పాల్పడినా…వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుని మరీ…తెలివిగా బయటపడే మన ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ , టీడీపీ అధినేత చంద్రబాబు పదే పదే తాను నిప్పు అంటూ చెవులు తుప్పులు వదిలేలా పదేపదే చెబుతూ జనాలను చావగొడుతుంటారు. తాజాగా మరోసారి చంద్రబాబు తాను ఎన్ని అరాచకాలు చేపినా నిప్పులా బతికాను అంటూ డైలాగ్ వేసేసారు. మొన్న స్కిల్ డెవలప మెంట్ కేసు, ఇప్పుడు 188 …
Read More »Blog Layout
బ్రేకింగ్.. భీమవరంలో పోలీసులపై రాళ్లదాడి…నారా లోకేష్కు నోటీసులు..!
పచ్చమీడియా ఎంత జాకీలు వేసి లేపినా…నారావారి పుత్రరత్నం, టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ పాదయాత్రకు ప్రజల్లో అనుకున్నంత స్పందన రావడం లేదు..దీంతో తనను తాను మాస్ లీడర్ గా ప్రజెంట్ చేసుకోవాలనే తాపత్రయంతో లోకేష్ మా అమ్మను అవమానించిన వారిని వదిలేదు లేదు.. వైసీపీ నేతలతో ఉచ్చపోయించి వారిని రోడ్ల మీద కట్ డ్రాయర్లతో తిప్పుతా అంటూ..ఊరమాస్ డైలాగులతో రెచ్చిపోతున్నాడు..టీడీపీ అధికారంలోకి రాగానే వల్లభనేని వంశీ, కొడాలి నాని వంటి …
Read More »పవన్ కల్యాణ్ని ఇందుకే చంద్రబాబు దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్ అనేది..!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ని బాబుగారి దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్ అంటే జనసేన శ్రేణులు అంతెత్తున లేస్తారు..కానీ ఆ విమర్శల్లో నిజం ఉందని వారికి కూడా తెలుసు..పవన్ అడుగులన్నీ చంద్రబాబు చెప్పినట్లే ఉంటాయని ఎవరూ చెప్పక్కర్లేదు..గత 9 ఏళ్లుగా ఆయన రాజకీయ పయనం చూస్తే చిన్నపిల్లాడికి కూడా అర్థమవుతోంది. పార్టీ పెట్టిన రోజే కాంగ్రెసోళ్ల పంచెలూడకొడతానని రంకెలు వేసిన పవన్ కల్యాణ్…చంద్రబాబు పేరు ఎత్తగానే ఆయనంటే గౌరవం ఉంది అంటూ…చిరునవ్వులు …
Read More »కాంగ్రెస్ లో తుమ్మల చేరికకు బ్రేక్…ఆ క్లారిటీ వచ్చాకే కండువా మార్పు..!
ఖమ్మం జిల్లా రాజకీయాల్లో మాజీ మంత్రి తుమ్మల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ లో కీలక నేతగా ఉన్న తుమ్మల ఈసారి పాలేరు టికెట్ ఆశించారు. అయితే గులాబీ బాస్, సీఎం కేసీఆర్ మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డికే మళ్లీ టికెట్ ఖరారు చేశారు. దీంతో తీవ్ర అసంతృప్తితో రగిలిపోయిన తుమ్మలకు కాంగ్రెస్ పార్టీ గాలం వేసింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ …
Read More »ముంపు ప్రాంతాలలో ఎమ్మెల్యే కె పి వివేకానంద్ పర్యటన
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వార్డ్ నెంబర్ 1 బాచుపల్లి డివిజన్ ప్రగతి అంటిల్ల లో ఈరోజు ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు,డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ గారు,కమిషనర్ రామకృష్ణ రావు గారు,సీనియర్ నాయకులు శ్రీ కోలన్ గోపాల్ రెడ్డి గారు,స్థానిక డివిజన్ కార్పొరేటర్ విజయలక్ష్మి సుబ్బారావు గారు,గౌరవ ప్రజాప్రతినిధులతో కలిసి వరద ముంపు ప్రాంతాలు పర్యటించారు. అలాగే తన అనుచరుల ద్వారా బచుపల్లి లోని ప్రణీత్ …
Read More »వరల్డ్ కప్-2023 ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఖరారు
భారత్ లో జరిగే వరల్డ్ కప్-2023కి ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు జట్టును ప్రకటించింది. కమిన్ స్ కెప్టెన్ గా 15 మంది సభ్యులతో ప్రకటించింది ఆసీస్.. జట్టులో కీలక ప్లేయర్లు లబుషేన్, టిమ్ డేవిడ్ కు చోటు దక్కలేదు. జట్టు: కమిన్స్ (సి), స్మిత్, వార్నర్, మాక్స్ వెల్, స్టార్క్, గ్రీన్, కారీ, అబాట్, అగర్, హాజిల్ వుడ్, హెడ్, ఇన్ ప్లస్, మార్ష్, స్టోయినిస్, జంపా
Read More »విక్రమ్ ల్యాండర్ గురించి తాజా అప్ డేట్
జాబిల్లిపై అమెరికా నాసాకు చెందిన లూనార్ రికనైసెన్స్ ఆర్బిటర్ చంద్రయాన్-3 ల్యాండింగ్ సైట్ ను క్లిక్ మనిపించింది. ఆగస్టు 27న తమ ఆర్బిటర్ (LRO) తీసిన ఫొటోలో విక్రమ్ ల్యాండర్ కనిపిస్తోందని నాసా తెలిపింది. చంద్రుడి దక్షిణ ధ్రువం మొదలయ్యే పాయింట్ నుంచి 600 కిలోమీటర్ల దూరంలో చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ ల్యాండ్ అయినట్లు పేర్కొంది.
Read More »ఇండియా పేరు మార్చాలంటే రాజ్యాంగం మార్చాలా..?.. వద్దా..?
ఇండియా పేరును భారత్ గా మార్చాలని ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఆలోచిస్తున్న సంగతి తెల్సిందే. అయితే ఈ వార్తలపై తాజాగా దేశ వ్యాప్తంగా నిరసన జ్వాలలు రేగుతున్నాయి. అయితే ఇండియా పేరు మార్చాలంటే రాజ్యాంగం మార్చాలా అనే అంశం ఇప్పుడు తెలుసుకుందాం.. రిపబ్లిక్ ఆఫ్ ఇండియా స్థానంలో రిపబ్లిక్ ఆఫ్ భారత్ అని వాడాలనుకుంటే రాజ్యాంగ సవరణ తప్పనిసరి అని లోక్ సభ మాజీ సెక్రటరీ …
Read More »ఇండోనేషియాకి ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేందర్ మోదీ ఈరోజు బుధవారం రాత్రికి ఇండోనేషియా రాజధాని జకార్తాకు బయల్దేరి వెళ్లనున్నారు. రేపు గురువారం రోజు జరగనున్న ఏసియాన్, తూర్పు ఆసియా సదస్సుల్లో ప్రధానమంత్రి నరేందర్ మోదీ పాల్గొంటారు. ఏషియాన్లోని సభ్య దేశాలతో వ్యాపార, సముద్ర తీర భద్రత సహకారంపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చించనున్నారు. తిరిగి ప్రధానమంత్రి మోదీ రేపు గురువారం సాయంత్రం భారత్ కు చేరుకోనున్నారు.
Read More »డీఎడ్ అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
తెలంగాణ వ్యాప్తంగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఇకనుంచి ఎస్జీటీ పోస్టుల్లో డీఎడ్ అభ్యర్థులనే అనుమతించనుంది. దీనికి సంబంధించి త్వరలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. రాజస్తాన్ లో టీచర్ల నియామకంపై దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఎస్జీటీ పోస్టులకు డీఎడ్ అభ్యర్థులు మాత్రమే అర్హులని తీర్పునిచ్చింది. ఈ మేరకు …
Read More »