ఆటో, కారు బుకింగ్ తర్వాత తమకు గిట్టుబాటు కావడం లేదని కొందరు డ్రైవర్లు రైడ్లను అకస్మాతుగా రద్దు చేస్తున్నారు. ఫలితంగా నిత్యం వేలాదిమంది ప్రయాణికులు రోడ్లపై తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ పరిస్థితిపై పలువురు నెటిజన్లు ఓలా దృష్టికి తీసుకెళ్లగా రైడ్ రద్దు ప్రక్రియకు ఎట్టకేలకు పరిష్కారం చూపింది. ఇకపై కస్టమర్ క్యాబ్ బుక్ చేసిన వివరాలు డ్రైవర్కు కనిపించేలా ఓలా యాప్లో స్వల్ప మార్పులు చేశారు. లొకేషన్, పేమెంట్ …
Read More »AIRTEL కస్టమర్లకు Big Shock
ప్రముఖ టెలికాం కంపెనీ భారతీ ఎయిర్టెల్ తమ కస్టమర్లకు షాక్ ఇచ్చింది. ప్రీపెయిడ్ ఛార్జీల (టారిఫ్) ను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఎంట్రీ టారిఫ్ వాయిస్ ప్లాన్లపై 20%, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ ప్లాన్లపై 25% వరకు పెంచనున్నట్లు తెలిపింది. ఛార్జీల పెంపు వల్ల ఒక్కో యూజర్పై వచ్చే సగటు ఆదాయం (Average Revenue Per User) రూ. 200-300కు చేర్చాలని భావిస్తోంది. పెరిగిన ఆదాయం 5G అమలుకు ఉపయోగపడుతుందని పేర్కొంది.
Read More »Gas Cylinder వినియోగదారులకు షాక్
దేశీయ చమురు కంపెనీలు వినియోగదారులకు షాక్ ఇచ్చాయి. వాణిజ్య సిలిండర్ ధరను రూ.266కు పెంచగా.. ఎల్పీజీ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. పెరిగిన ధరలు నేటి నుంచి అమలులోకి రానున్నాయి. తాజాగా పెంచిన ధరలతో కమర్షియల్ సిలిండర్ ధర దేశ రాజధాని ఢిల్లీలో రూ.2000 మార్క్ను దాటింది. ఇంతకు ముందు ధర రూ.1735గా ఉండేది. ప్రస్తుతం రూ.2,175కు పెరిగింది. ముంబైల్లో 19 కిలోల గ్యాస్ సిలిండర్ ధర రూ.1950, …
Read More »ఫ్లిప్కార్ట్ లో క్రేజీ ఆఫర్స్
రాబోయేది పండుగల సీజన్ కావడంతో.. ప్రముఖ ఈ కామర్స్ సంస్థలన్నీ స్పెషల్ సేల్స్ను ప్రారంభించాయి. ఇప్పటికే ప్రైమ్ మెంబర్స్ కోసం అమెజాన్.. గ్రేట్ ఇండియన్ సేల్ను ఈరోజు నుంచి ప్రారంభించింది. అలాగే.. ఫ్లిప్కార్ట్ కూడా బిగ్ సేవింగ్ డేస్ పేరుతో సేల్ను నిర్వహిస్తోంది. అక్టోబర్ 3 నుంచి ఈ సేల్ ప్రారంభం అవనుంది. కానీ.. అక్టోబర్ 2 నుంచి అంటే ఈరోజు నుంచే ప్లస్ మెంబర్స్ కోసం సేల్ను ప్రారంభించింది …
Read More »అంబానీ చేతుల్లోకి జస్ట్ డయల్
దేశీయ ఈ-కామర్స్ మార్కెట్లో మరింత పట్టు సాధించే దిశగా రిలయన్స్ రిటైల్ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా లోకల్ సెర్చింజిన్ జస్ట్ డయల్లో 40.95% వాటాలు కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ డీల్ విలువ రూ. 3,497 కోట్లని తెలిపింది. కంపెనీ తదుపరి వృద్ధి లక్ష్యాల సాధనకు తోడ్పడేలా జస్టడయల్ వ్యవస్థాపకుడు VSS మణి ఇకపైనా మేనేజింగ్ డైరెక్టర్, సీఈవోగా కొనసాగుతారని రిలయన్స్ తెలిపింది.
Read More »రెడ్డీస్ ల్యాబ్స్ వ్యవస్థాపకుడు. డా.కళ్ళం అంజిరెడ్డి గారి ప్రత్యేక వ్యాసం…
రెడ్డీస్ ల్యాబ్స్ వ్యవస్థాపకుడు. డా.కళ్ళం అంజిరెడ్డి గారి ప్రత్యేక వ్యాసం… జననం సాధారణ రైతు కుటుంబంలో పేరు ప్రఖ్యాతులు పొందిన కళ్ళం అంజిరెడ్డి గారు 1940లో గుంటూరు జిల్లా తాడెపల్లిలో జన్మించారు ఔషధ రంగంలో ఎవరైనా బహుళజాతి కంపెనీలను సవాలు చేయగలరా? ఫైజర్కు దీటుగా ఒక ఔషధ సంస్థను మనదేశంలో నిర్మించాలని కలగనే సాహసం ఎవరికైనా ఉంటుందా? ఇదిగో వచ్చేస్తున్నాం… అంటూ అమెరికా ఔషధ మార్కెట్లో పెనుసంచలనాలను నమోదు …
Read More »వాహనదారులకు భారీ షాక్
బ్రేక్ లేకుండా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారులకు షాక్ ఇస్తున్నాయి. తాజాగా ఆయిల్ కంపెనీలు పెట్రోల్ లీటర్కు 26 పైసలు, డీజిల్ లీటర్కు 34 పైసలు పెంచాయి. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ రూ.95.13కు చేరగా డీజిల్ ధర రూ.89.47గా ఉంది. వ్యాట్ ఎక్కువగా ఉన్న కొన్ని రాష్ట్రాల్లో ధరలు రూ.100 దాటాయి. కొవిడ్ సంక్షోభంతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు పెరుగుతున్న పెట్రోల్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి.
Read More »ఏపీలో మామిడి పండ్లకు బలే గిరాకీ
కరోనా కష్టకాలంలోనూ..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మామిడి ఎగుమతులు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో 3,76,495 హెక్టార్లలో మామిడి సాగవుతుండగా.. ఈ ఏడాది 56.47 లక్షల టన్నుల దిగుబడులు వస్తాయని అంచనా. బంగినపల్లి, సువర్ణ రేఖ, తోతాపురి, చిన్న రసాలకు దేశీయంగానే కాకుండా విదేశాల నుంచి కూడా ఆర్డర్స్ వస్తున్నాయి. సువర్ణ రేఖ మామిడిని దక్షిణ కొరియాకు తొలిసారి ఎగుమతి చేశారు. విదేశాలకు, వివిధ రాష్ట్రాలకు మామిడి రవాణా అవుతోంది
Read More »వరుసగా మూడో రోజు పెట్రోల్ మంట
దేశంలో 5 రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత వరుసగా మూడో రోజు కూడా పెట్రో ధరలు పెరిగాయి. ఢిల్లీలో గురువారం లీటర్ పెట్రోలుపై 25 పైసలు, డీజిల్పై 30 పైసలను చమురు సంస్థలు పెంచాయి. ఇక హైదరాబాద్లో లీటరు పెట్రోలుపై 23 పైసలు పెరగగా.. రూ.94.57కు చేరింది. డీజిల్ ధర లీటరుకు 31 పైసలు పెరగగా.. రూ. 88.77కు ఎగబాకింది.
Read More »దేశంలోని ప్రైవేటు, ప్రభుత్వ బ్యాంకులకు 9 రోజులపాటు సెలవులు
దేశంలోని ప్రైవేటు, ప్రభుత్వ బ్యాంకులకు ఏప్రిల్ నెలలో 9 రోజులపాటు సెలవులను రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. రిజర్వు బ్యాంకు ఈ వారంలోనే వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ప్రకటించింది.మంగళవారం ఏప్రిల్ 13 నుంచి 16వతేదీ వరకు నాలుగురోజుల పాటు వివిధ పండుగల సందర్భంగా బ్యాంకులకు సెలవులు ఇస్తున్నట్లు రిజర్వు బ్యాంక్ వెల్లడించింది. దేశంలోని వివిధ ప్రాంతాలు, రాష్ట్రాల వారీగా బ్యాంకులకు 4రోజులపాటు వరుస సెలవులు …
Read More »