నేడు బంగారం ధర భారత్ బులియన్ మార్కెట్లో పరుగులు పెడుతోంది. నిన్న కాస్త తగ్గిన బంగారం ధర నేడు మాత్రం షాకిచ్చింది. ఈ నెలలో ఇంత పెద్ద మొత్తంలో పెరగడం ఇది రెండో సారి. దీపావళి తర్వాత నుంచి బంగారం ధర చాలా తక్కువ రోజులు మినహా మొత్తంగా పెరుగుతూనే ఉంది. నేడు అంటే నవంబర్ 18న దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ఏకంగా రూ.750 వరకు …
Read More »టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ట్రాప్ కేసు.. హైకోర్టు కీలక ఆదేశాలు
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ట్రాప్ వేసిన కేసులో తెలంగాణ హైకోర్టు కీలకమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో దర్యాప్తు నిలిపేయాలంటూ గతంలో ఇచ్చిన స్టేను ఉన్నత న్యాయస్థానం రద్దు చేసింది. ఈ వ్యవహారంపై మొయినాబాద్ పోలీసులు దర్యాప్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఇలాంటి కేసుల్లో ఎక్కువ రోజులు ఇన్వెస్టిగేషన్ నిలిపివేయడం సరికాదని అభిప్రాయపడింది. ఎమ్మెల్యేలకు ఎర కేసులో సీబీఐ లేదా సిట్తో దర్యాప్తు జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని బీజేపీ నేత ప్రేమేందర్రెడ్డి …
Read More »శబరి ఎక్స్ప్రెస్కు తప్పిన పెను ప్రమాదం
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నగరం నుండి తిరువనంతపురం వెళ్తున్న శబరి ఎక్స్ప్రెస్కు ఏపీలోని గుంటూరు జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. గుర్తుతెలియని దుండగులు గుంటూరు రైల్వేస్టేషన్కు సమీపంలోని కంకరగుంట గేటు వద్ద రైల్వేట్రాక్పై అడ్డంగా ఇనుపరాడ్ను కట్టారు. ఎవరికి అనుమానం రాకుండా దానిపై అట్టముక్కలు పెట్టారు. పది నిమిషాల్లో శబరి ఎక్స్ప్రెస్ ఈ మార్గంలో వెళ్లే సమయంలో స్థానికులు గమనించి రైల్వే పోలీసులకు సమాచారం అందించగా హుటాహుటిన …
Read More »బండ్లన్న సంచలన నిర్ణయం.. ఇకపై వాటికి దూరంగా ఉంటా..!
సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలకు ఇకపై దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఆయన ప్రకటించారు. కుటుంబ బాధ్యతలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు బండ్ల గణేష్ ట్వీట్ చేశారు. ‘కుటుంబ బాధ్యతలు, వ్యాపారాలు.. పిల్లల భవిష్యత్ గురించి ఆలోచించి రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. నాకు ఏ రాజకీయ పార్టీతో శత్రుత్వం, మిత్రుత్వం గానీ లేదు. అందరూ నాకు ఆత్మీయులే. ఇంతకుముందు …
Read More »సమంతకు అరుదైన వ్యాధి.. షాకిచ్చిన నటి
ప్రముఖ నటి సమంత షాకింగ్ న్యూస్ చెప్పింది. ఆమె అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ఈ విషయాన్ని స్వయంగా సమంత ట్విటర్ ద్వారా వెల్లడించింది. ‘మయోసైటిస్’ అనే అరుదైన వ్యాధితో బాధ పడుతున్నట్లు తెలిపింది. ‘‘జీవితం ముగింపులేని సవాళ్లను నా ముందు ఉంచింది. మీరు చూపిస్తున్న ప్రేమ, అనుబంధం నాకు మరింత మనోబలాన్ని, ఆ సవాళ్లను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తోంది. గత కొన్ని నెలల నుంచి ‘మయోసైటిస్’ అనే ఆటో ఇమ్యూనిటీ …
Read More »ఆర్జీవీ మరో సంచలనం.. పొలిటికల్ బ్యాక్డ్రాప్ మూవీ ప్రకటన
ఎప్పుడూ తనదైన శైలి వ్యాఖ్యలు, సినిమాలతో చర్చనీయాంశంగా ఉండే ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్ వర్మ మరో సంచలనానికి తెరతీశారు. తాను త్వరలో తీయబోయే సినిమా రాజకీయ అంశానికి చెందినదని.. దీన్ని వ్యూహం, శపథం అనే రెండు భాగాలుగా తెరకెక్కించనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆర్జీవీ ట్వీట్ చేశారు. ఏపీ సీఎం జగన్ను కలిసిన మర్నాడే ఈ ప్రకటన రావడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఆయన ఎవరి ఉద్దేశించి తీస్తాడు? అందులో ఏయే …
Read More »గ్రహణం తర్వాత పాటించాల్సిన నియమాలు ఇవే.!
సూర్యగ్రహణం పూర్తవుతోంది. సాయంత్రం 5.03 నిమిషాలకు ప్రారంభమైన పాక్షిక సూర్యగ్రహణం.. 5.45 గంటలకు ముగిసింది. ఈ నేపథ్యంలో గ్రహణం తర్వాత పాటించాల్సిన నియమాలను చూద్దాం. గ్రహణం పూర్తవగానే ఇంట్లోని వారంతా విడుపు స్నానం చేయాలి. ఈ నియమాన్ని అందరూ కచ్చితంగా పాటించి తలంటుకోవాలి. పూజా మందిరంలో ఉన్న చిత్రపటాలు, విగ్రహాలను శుద్ధి చేయాలి. దానితో పాటు వంటకాలు, ఇంట్లోని వస్తువులపై ఉంచిన దర్భ గడ్డిని తీసేయాలి. స్నానమాచరించిన తర్వాత ఇంటిని …
Read More »గోల్కొండలో దారుణం.. కొడుకు కొట్టిన దెబ్బలకు తండ్రి మృతి!
హైదరాబాద్లోని గోల్కొండలో దారుణం చోటుచేసుకుంది. ఓ కొడుకు కన్న తండ్రిని ఇష్టమొచ్చినట్లు కొట్టాడు. కొడుకు కొట్టిన దెబ్బలకు తాళలేక తండ్రి మృతి చెందాడు. ఇబ్రహీంబాగ్కు చెందిన 60 ఏళ్ల వినాయక శంకరయ్య, నీలమ్మలకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతురులు. వినాయక శంకరయ్య పెద్దకొడుకు మీరాబాబు మద్యానికి బానిసయ్యాడు. ముసలి తల్లిదండ్రులకు అండగా ఉండాల్సిన మీరాబాబు తాగడానికి డబ్బులు ఇవ్వమని నిత్యం వారిని వేధించేవాడు. డబ్బులు లేవని చెప్పడంతో ముసలివారు అని …
Read More »4 ఏళ్ల చిన్నారిని రెండు నెలలుగా..!
రోజు రోజుకు కామాంధులు చిన్నాపెద్దా తేడా లేకుండా రెచ్చిపోతున్నారు. వారి కామానికి పసిపిల్లల్ని సైతం వదలడం లేదు. తాజాగా ఓ నాలుగేళ్ల చిన్నారిపై ఆ స్కూల్ ప్రిన్సిపల్ డ్రైవర్ కన్ను పడింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రెండు నెలలుగా చిన్నారిపై జుగుప్సాకరమైన రీతిలో లైంగిక దాడి చేస్తున్నాడు. పాప రోజు రోజుకు నీరసంగా తయారవ్వడంతో అనుమానంతో తల్లి బుజ్జగించి విషయం తెలుసుకుంది. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు, …
Read More »దారుణం.. భార్యా పిల్లల్ని కత్తెరతో పొడిచి చంపేసి.. తానూ..!
హైదరాబాద్లోని శేరిలింగంపల్లిలోని పాపిరెడ్ది కాలనీలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన భార్య పిల్లల్ని చంపేసి తానూ ఆత్మహత్య చేసుకొని మృతిచెందాడు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సమీపంలోని కోహిర్కు చెందిన నాగరాజు, సుజాత దంపతులు. వీరికి సిద్ధప్ప, రమ్మశ్రీ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరు కొన్నేళ్లుగా శేరిలింగంపల్లిలోని పాపిరెడ్డి కాలనీలో నివాసం ఉంటున్నాడు. నాగరాజు స్థానికంగా సేల్స్మెన్ ఉద్యోగం చేస్తున్నాడు. సుజాత ఇంట్లో ఉంటూ టైలర్గా పనిచేస్తోంది. అయితే …
Read More »