Home / Tag Archives: ktrtrs (page 63)

Tag Archives: ktrtrs

సీఎం కేసీఆర్‌కు పాదాభివంద‌నాలు-హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాద‌వ్

ఇల్లంత‌కుంట‌లో టీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ బుధ‌వారం జ‌రిగింది. ఈ స‌భ‌కు హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గ టీఆర్ఎస్ అభ్య‌ర్థి గెల్లు శ్రీనివాస్ యాద‌వ్ హాజ‌రై ప్ర‌సంగించారు. త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే ఉప ఎన్నిక‌లో త‌న‌కు పోటీ చేసే అవ‌కాశం క‌ల్పించిన సీఎం కేసీఆర్‌కు శ్రీనివాస్ యాద‌వ్ పాదాభివంద‌నాలు తెలిపారు. త‌న‌ను గెలిపించాల‌ని హ‌రీశ్ రావుకు పార్టీ నాయ‌క‌త్వం బాధ్య‌త‌లు అప్ప‌గించారు. పేద కుటుంబం నుంచి వ‌చ్చిన త‌న‌కు అవ‌కాశం ఇచ్చారు. విద్యార్థి నేత‌గా …

Read More »

హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో సంబురాలు

హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం టీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థిగా గెల్లు శ్రీనివాస్ యాద‌వ్ పేరును ప్ర‌క‌టించ‌డంతో.. టీఆర్ఎస్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌తో పాటు ఆయ‌న మ‌ద్ద‌తుదారులు సంబురాలు చేసుకుంటున్నారు. గెల్లు శ్రీనివాస్ పేరును సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించిన మ‌రుక్ష‌ణ‌మే పెద్ద ఎత్తున సంబురాలు చేసుకుంటూ.. ట‌పాసులు కాల్చారు. ఒక‌రికొక‌రు స్వీట్లు పంచుకుని సంతోషం వ్య‌క్తం చేశారు.గెల్లు అభ్య‌ర్థిత‌త్వంపై యువ‌త‌లో ఉత్సాహం వెలువెత్తితింది. శ్రీనివాస్ యాద‌వ్‌ను గెలిపించుకుంటామ‌ని నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌తి ఊరు, వాడ‌ ఏకోన్ముఖంగా ప్ర‌క‌టిస్తున్నాయి. …

Read More »

రైతుబీమాకు 1,450 కోట్లు

రైతుబీమా పథకం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.1,450 కోట్లను విడుదలచేసింది. మంగళవారం వ్యవసాయంపై జరిగిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో 2021-22 సంవత్సరానికి రైతుబీమా ప్రీమియం చెక్కును మంత్రులు ఎల్‌ఐసీ ప్రతినిధులకు అందజేశారు. రైతులపై ఆర్థికభా రం పడొద్దనే ఉద్దేశంతో మూడేండ్లుగా ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తున్నది. రైతులు.. ఏ కారణం చేత మరణించినా వారి కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం అందేలా చూస్తున్నది. సమావేశంలో మంత్రులు నిరంజన్‌రెడ్డి, కేటీఆర్‌, …

Read More »

తిరుమలేశుడి సేవలో ఎంపీ సంతోష్ కుమార్

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఎంపీ సంతోష్ కుమార్ దర్శించుకున్నారు. సతీసమేతంగా తిరుమల చేరుకున్న ఆయన బుధవారం ఉదయం నైవేద్య విరామ‌ సమయంలో స్వామివారి దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు సంతోష్‌ కుమార్‌ దంపతులకు ఆశీర్వచనం‌ అందించగా, టీటీడీ అడిషనల్ ఈవో ధర్మారెడ్డి వారికి స్వామివారి పట్టు వస్త్రాలు, తీర్థప్రసాదాలను అందజేశారు. నేడు ఎంపీ సంతోస్‌ కుమార్‌ వివాహ వార్షికోత్సం కావడంతో …

Read More »

త్వరలోనే పోడు భూములకు పరిష్కారం

ప్రకృతిలో భాగమై నివసించే ఆదివాసీలు అత్యంత స్వచ్ఛమైన మనుషులని, మానవ సమాజంలో ఇంకా తరిగిపోని మమతానురాగాలకు, కల్మశంలేని మానవీయ సంబంధాలకు ప్రతీకలని సీఎం కేసీఆర్‌ కొనియాడారు. స్వయం పాలనలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీల అభివృద్ధి, సంక్షేమానికి అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నదని పేర్కొన్నారు. అటవీ భూముల సర్వేను చేపట్టడంతో పాటు.. త్వరలోనే పోడు భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించనున్నామని చెప్పారు. పోడు భూములకు కూడా రైతుబంధును అందిస్తున్నామన్నారు. …

Read More »

వేములవాడలో రూ.20కోట్లతో అభివృద్ధి పనులు

తెలంగాణ రాష్ట్రంలోని  రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ నియోజకవర్గంలో రూ.20కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు మంత్రి కేటీఆర్‌ తెలిపారు. మంగళవారం మంత్రి కేటీఆర్‌ను వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో చేపట్టే పనుల వివరాలను మంత్రికి అందించారు. అనంతరం మంత్రి కేటీఆర్ వేములవాడ అభివృద్ధిపై సమీక్షించి, అభివృద్ధికి పరిపాలన అనుమతులు జారీ చేశారు. రూ.20కోట్ల విలువైన పనులు ప్రారంభించేందుకు అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌కు …

Read More »

దళితబంధులో ‘భోపాల్’ స్ఫూర్తి…

దళిత బంధు పేరుతో ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు ఒక చారిత్రక నిర్ణయాన్ని ప్రకటించి కొత్త చర్చకు తెరలేపారు. కొందరు విమర్శిస్తున్నట్టు అది హడావుడిగా తెచ్చిన పథకం కాదు. ఈ పథకంపై ఏడాది కాలంగా ముఖ్యమంత్రి కసరత్తు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆయన ఇటువంటి పథకం రాబోతుందన్న సంకేతాలు ఇస్తూనే ఉన్నారు. గడిచిన ఆరు నెలల్లో అనేక చర్చలు, సంప్రదింపులూ జరిపారు. దళిత శాసన సభ్యులు ఇప్పటికే ఒకసారి కడియం …

Read More »

హుజూరాబాద్‌ లో దళితబంధు సంబురాలు

దళితబంధు పథకం అమలుకు పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపికైన హుజూరాబాద్‌ నియోజకవర్గానికి ప్రభుత్వం రూ.500 కోట్లు విడుదలచేసింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను సోమవారం ఎస్సీ అభివృద్ధిశాఖ కార్యదర్శి రాహుల్‌బొజ్జా జారీచేశారు. నియోజకవర్గంలోని దళితులందరికీ వర్తించేలా (సాచురేషన్‌ మోడ్‌) పథకాన్ని ప్రభుత్వం చేపడుతున్నదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం విడుదలచేసిన నిధులను హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని ఐదువేల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున అందజేసి ఉపాధి కల్పిస్తారు. ఉత్తర్వులు వచ్చిన వెంటనే హుజూరాబాద్‌ …

Read More »

హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి. కేశవరావు మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

తెలంగాణ రాష్ట్ర హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి. కేశవరావు మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు సంతాపం వ్యక్తం చేశారు. న్యాయమూర్తిగా కేశవరావు, పేదలకు అందించిన న్యాయ సేవలను సీఎం స్మరించుకున్నారు. కేశవరావు కుటుంబ సభ్యులకు సీఎం  కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కేశవరావు అంత్యక్రియలను ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహించాలని, సీఎస్ సోమేశ్ కుమార్ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. 

Read More »

చేర్యాలలో రూ. కోటి 25 లక్షలతో బీఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ భవనo

సిద్దిపేట జిల్లా చేర్యాలలో రూ. కోటి 25 లక్షలతో అన్ని హంగులతో డాక్ట‌ర్ బీఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ భవనo నిర్మిస్తామ‌ని ఆర్థిక మంత్రి హ‌రీష్ రావు తెలిపారు. ఇవాళ అంబేద్క‌ర్ క‌మ్యూనిటీ భ‌వ‌నానికి మంత్రి భూమి పూజ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డితో పాటు ప‌లువురు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి హ‌రీష్ రావు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat