భారతదేశ వాణిజ్య రంగాన్నే శాసిస్తున్న ప్రముఖ బడా పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ మరో సరికొత్త వ్యాపారంలోకి అడుగు పెట్టబోతున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా ఫుడ్, డ్రింక్స్ బిజినెస్ లోకి అడుగుపెట్టినట్లు రిలయన్స్ బ్రాండ్స్ ప్రకటించింది. బ్రిటన్ దేశానికి చెందిన ఫ్రెష్ ఫుడ్, ఆర్గానిక్ కాఫీ సంస్థ ‘ప్రెట్ ఏ మ్యాంగర్’తో లాంగ్ టర్మ్ మాస్టర్ ఫ్రాంఛైజీ భాగస్వామ్యాన్ని రిలయన్స్ బ్రాండ్స్ కుదుర్చుకుంది. దేశవ్యాప్తంగా బ్రాంచీలు ఏర్పాటు చేయనుంది. ముందుగా దేశంలో …
Read More »ముఖేశ్ అంబానీ కొత్త కారు ధర ఎంతో తెలుసా..?
భారతదేశంలోనే రెండవ అత్యంత సంపన్నుడు ముఖేశ్ అంబానీ తాజాగా రూ.13.14కోట్ల విలువైన అల్ట్రా లగ్జరీ కారును కొనుగోలు చేశారు. ఈ హ్యాచ్ బ్యాక్ కారు బ్రిటీష్ విలాసవంతమైన వాహనాల తయారీ సంస్థ రోల్స్ రాయిస్ కు చెందింది. ఈ కారును సౌత్ ముంబయిలోని టార్డియో ఆర్టీఓలో రూ. 20లక్షలు పెట్టి రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ పెట్రోల్ కారు దేశంలో ఇప్పటివరకు కొనుగోలు చేయబడిన అత్యంత ఖరీదైన కార్లలో ఒకటి.
Read More »దూసుకెళ్తున్న రిలయన్స్ జియో
రిలయన్స్ జియో నవంబర్ 20.19 లక్షల మంది యూజర్లను సొంతం చేసుకుంది. దీంతో ఆ కంపెనీ 42.8 కోట్ల మంది వినియోగదారులతో ప్రథమ స్థానంలో నిలిచింది. స్పెక్ట్రం కేటాయింపులకు సంబంధించి రూ. 30,791 కోట్ల బకాయిలను కేంద్ర ప్రభుత్వానికి చెల్లించింది. ఎయిర్టెల్కు కొత్తగా 13.18 లక్షల మంది చందాదారులు చేరగా, వొడాఫోన్ ఐడియా 18.97 లక్షల మంది యూజర్లను కోల్పోయింది.
Read More »అంబానీ చేతుల్లోకి జస్ట్ డయల్
దేశీయ ఈ-కామర్స్ మార్కెట్లో మరింత పట్టు సాధించే దిశగా రిలయన్స్ రిటైల్ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా లోకల్ సెర్చింజిన్ జస్ట్ డయల్లో 40.95% వాటాలు కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ డీల్ విలువ రూ. 3,497 కోట్లని తెలిపింది. కంపెనీ తదుపరి వృద్ధి లక్ష్యాల సాధనకు తోడ్పడేలా జస్టడయల్ వ్యవస్థాపకుడు VSS మణి ఇకపైనా మేనేజింగ్ డైరెక్టర్, సీఈవోగా కొనసాగుతారని రిలయన్స్ తెలిపింది.
Read More »అంబానీలకు రూ.25 కోట్ల జరిమానా
దాదాపు రెండు దశాబ్దాల క్రితం జరిగిన ఓ కేసులో ముకేశ్, అనిల్ అంబానీతో పాటు వారి భార్యలకు సెబీ రూ.25 కోట్ల జరిమానా విధించింది. 2000వ సంవత్సరంలో 5శాతం వాటా కొనుగోలుకు సంబంధించి రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రమోటర్లు కొందరితో కుమక్కైంది.. పీఏసీ వివరాలు ప్రకటించడంలో విఫలం అయ్యారని సెబీ ఈ సందర్భంగా తెలిపింది. అయితే పెనాల్టీని సంయుక్తంగా లేదా విడిగా అయినా చెల్లించవచ్చని సెబీ వారికి సూచించింది.
Read More »రిలయన్స్ జియో బంపర్ ఆఫర్లు
ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన కస్టమర్లకు బంపర్ ఆఫర్లు ప్రకటించింది. రూ.1,999 విలువైన జియో ఫీచర్ ఫోన్ కొన్న వారికి 24 నెలల పాటు అన్లిమిటెడ్ సర్వీస్ అందిస్తోంది. రూ.1,499కి లభించే మరో ఫీచర్ ఫోన్ కొంటే 12 నెలల సర్వీస్ కల్పిస్తోంది. ఈ రెండు ప్లాన్లలో అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ తో పాటు నెలకు 2 జీబీ (4G) డేటా వాడుకోవచ్చు. ప్రస్తుతం జియో ఫోన్ …
Read More »ముకేశ్ అంబానీకి భారీ జరిమానా
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీతో పాటు మరో రెండు ఇతర సంస్థలకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) జరిమానా విధించింది. 2007లో రిలయన్స్ పెట్రోలియం లిమిటెడ్ షేర్ల ట్రేడింగ్ లో అవకతవకలకు సంబంధించిన కేసులో రిలయన్స్ ఇండస్టీస్పై రూ.25 కోట్లు, అంబానీకి రూ 15 కోట్ల చొప్పున ఫైన్ పడింది. ఇదే కేసులో నవీ ముంబై సెజ్ రూ.20 కోట్లు, ముంబై సెజ్ …
Read More »జియో సంచలనం
టెలికాం రంగంలో జియో రిలయన్స్ మరో సంచలనం సృష్టించింది. జూలై నెలలో కొత్తగా జియో నెట్ వర్క్ ను దాదాపు ముప్పైదు లక్షల మంది ఎంచుకున్నారు. దీంతో మొత్తం నలబై కోట్ల మంది వినియోగదారులు గల సంస్థగా జియో అవతరించింది. ప్రారంభించిన ఐదేళ్లలోనే ఈ ఘనతను సాధించడం విశేషం. అయితే ఎయిర్ టెల్ కు 15.5కోట్లు,వోడాఫోన్ -ఐడియా కు 11.6కోట్లు,బీఎస్ఎన్ఎల్ కు 2.3కోట్ల మంది వినియోగదారులున్నారు. మొత్తం మీద దేశం …
Read More »ముకేశ్ అంబానీ సంపద రూ.6,49,639 కోట్లు
ఫోర్బ్స్ భారతీయ కుబేరుల జాబితాలో ముకేశ్ అంబానీ ఆధిపత్యం కొనసాగుతున్నది. వరుసగా 13వ ఏడాదీ దేశ సంపన్నులలో అగ్రస్థానంలో నిలిచారు. ఈ ఏడాదికిగాను గురువారం విడుదలైన లిస్ట్లో 88.7 బిలియన్ డాలర్ల (రూ.6,49,639 కోట్లు) సంపదతో ముకేశ్ మరోసారి మొదటి ర్యాంక్ను నిలబెట్టుకున్నారు. నిరుడుతో పోల్చితే ఈసారి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత సంపద 37.3 బిలియన్ డాలర్లు ఎగబాకడం గమనార్హం. కరోనాలోనూ సంపద పరుగు యావత్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న …
Read More »అంబానీ సంచలన నిర్ణయం
ఆసియా అపరకుబేరుడు, ప్రపంచంలోనే నాలుగో అత్యంత సంపన్నుడు ముకేశ్ అంబానీ (63) మరో కీలక నిర్ణయంపై అడుగులు వేస్తున్నారు. వ్యాపార విస్తరణలో ఎదురు లేకుండా దూసుకుపోతున్న తన ముగ్గురు సంతానానికి వ్యాపార సామ్రాజ్య వారసత్వ బాధ్యతలను సమానంగా పంచేందుకు రంగంలోకి దిగిపోయారు. ఇందులో భాగంగానే త్వరలోనే ఫ్యామిలీ కౌన్సిల్ ఏర్పాటు చేస్తున్నారంటూ బిజినెస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. 80 బిలియన్ డాలర్లకు పైగా విలువ కలిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ …
Read More »