దేశంలో త్వరలో జరగనున్న వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఔరంగబాద్ నుంచి తమ పార్టీ పోటీ చేయనున్నట్లు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. ఔరంగాబాద్తో పాటు ఇతర స్థానాల గురించి కూడా పోటీ చేసేందుకు ఆలోచిస్తున్నాము.. ఎవరితో పొత్తు కుదుర్చుకోవాలన్న దానిపై కూడా కొన్ని పార్టీలతో సంప్రదింపుల్లో ఉన్నట్లు ఆయన వెల్లడించారు. అయితే ఎవరితో పొత్తు పెట్టుకుంటామనే దానిపై ఇంత త్వరగా వెల్లడించలేమని ఎంఐఎం చీఫ్ తెలిపారు.
Read More »పశువులకు కూడా ఆధార్ నంబర్
దేశంలో త్వరలో పశువులకు కూడా ఆధార్ నంబర్ ఇవ్వనున్నట్టు నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ తెలిపారు. పశువులకు వచ్చే పలు రకాల వ్యాధుల పుట్టుక గురించి వీలైనంత త్వరగా తెలుసుకోవాలని అప్పుడే దాని నివారణకు వ్యాక్సిన్ను, ఇతర మార్గాలను అన్వేషించడం సులభమవుతుందని ఆయన ఈ సందర్భంగా అన్నారు. బయో ఏషియా సదస్సులో భాగంగా మొదటి రోజు ప్యానల్ డిస్కషన్లో ‘వన్ హెల్త్ అప్రోచ్, స్వదేశీ పరిజ్ఞానం, విధానం’ అంశంపై …
Read More »కేంద్రం; అంకెల మాయ- కేంద్ర ప్రభుత్వ జీడీపీ వృద్ధిరేటు:
కేంద్ర ఆర్థిక శాఖామంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ‘భారతదేశం 2023-24లో నామినల్ జీడీపీ వృద్ధిరేటు 10.5 శాతం ఉండబోతున్నద’ని చెప్పుకొచ్చారు. అయితే 2023-24లో ద్రవ్యోల్బణం 5 నుంచి 5.5 శాతంగా ఉండబోతున్నదని రిజర్వ్ బ్యాంక్ తన నివేదికలో పేర్కొన్నది. అంటే వాస్తవ జీడీపీ సుమారు 5 నుంచి 5.5 శాతానికి మించి ఉండకపోవచ్చునని ఆర్బీఐ గణాంకాలను క్రోడీకరించి చూస్తే అర్థమవుతున్నది. ద్రవ్యోల్బణం సర్దుబాటు చేసిన జీడీపీని వాస్తవ …
Read More »ఈ నెల 11న హైదరాబాద్ కు అమిత్ షా
కేంద్రమంత్రి అమిత్ షా ఈనెల 11న హైదరాబాద్ రానున్నారు. నేషనల్ పోలీస్ అకాడమీలో జరగనున్న ట్రైనీ ఐపీఎస్ల పరేడ్కు ఆయన హాజరవుతారు. 190 మంది ట్రైనీ ఐపీఎస్ల పాసింగ్ ఔట్ పరేడ్ సందర్భంగా అమిత్ షా వారితో మాట్లాడనున్నారు. వీరిలో 29మంది విదేశీ ఆఫీసర్లు, తెలంగాణకు చెందిన ఐదుగురు, ఏపీకి చెందిన ఇద్దరు ట్రైనీ ఐపీఎస్ లు ఉన్నారు.
Read More »రైతులను ముక్కు పిండి రుణాలను వసూలు చేయాలి-బీజేపీ ఎంపీ
ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరోసారి తన రైతు వ్యతిరేక వైఖరిని బయటపెట్టుకొన్నది. పంట నష్టపోయిన రైతన్నలకు అండగా వారి రుణాలు మాఫీ చేయడం ఘోరమైన తప్పిదమన్నట్టుగా కర్ణాటకకు చెందిన బీజేపీ ఎంపీ, ఆ పార్టీ యువమోర్చా అధ్యక్షుడు తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రైతు రుణమాఫీతో దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టమని, రైతుల నుంచి రుణాలను ముక్కుపిండి వసూలు చేయాల్సిందేనని …
Read More »సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఐదుగురు
దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా కొలీజియం సిఫారసు చేసిన ఐదుగురి నియామకాలకు ఎట్టకేలకు నిన్న శనివారం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ట్విట్టర్లో వెల్లడించారు. కొలీజియం సిఫారసులపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరు మీద సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఒకరోజు తర్వాతనే తాజా నియామకాలకు ఆమోదముద్ర వేయడం గమనార్హం. కొత్తగా నియమితులైన వారిలో తెలుగు వ్యక్తి జస్టిస్ …
Read More »ముఖ్యమంత్రి కేసీఆర్ దెబ్బకు దిగోచ్చిన మోదీ సర్కారు
తెలంగాణ రాష్ట్ర అధికార బీఆర్ఎస్ అధినేత.. ముఖ్యమంత్రి కేసీఆర్ దెబ్బకు కేంద్రంలోని మోదీ నాయకత్వంలో బీజేపీ సర్కారు దిగొచ్చింది. భిన్న భాషలు, భిన్న సంప్రదాయాలు ఉన్న దేశంలో ఫెడరల్ స్పూర్తి పరిఢవిల్లాలని సీఎం కేసీఆర్ చేస్తున్న కృషికి కీలక ఫలితం దకింది. సీఎం కేసీఆర్ డిమాండ్ మేరకు ఇకనుంచి పోటీ పరీక్షలను అన్ని ప్రాంతీయ భాషల్లో నిర్వహించనున్నారు. రైల్వే, డిఫెన్స్, బ్యాంకింగ్ తదితర కేంద్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో …
Read More »జనాన్ని దోచి.. కుబేరులకు పంచి!
అచ్చే దిన్, మోదీ హైతో ముమ్కీన్ హై అంటూ అధికారానికి వచ్చిన తరువాత మోదీ నిజంగానే పేదల కోసం పాటుపడ్డారా? లేక బడా వ్యాపారస్థుల కోసం పనిచేస్తున్నారా? అనే సందేహాలు రోజు రోజుకూ బలపడుతున్నాయి.ఎన్నికల ముందు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి అధికారానికి రావడానికి బీజేపీ పాలకులు అలవాటుపడ్డారు. కానీ, ప్రజల సంక్షేమం కోసం కృషి చేసి ఓట్లడిగే పరిస్థితి ఎప్పుడూ లేదు. వాస్తవానికి మోదీ రెండు పర్యాయాల పరిపాలనలో …
Read More »ప్రధానమంత్రి మోదీ ఇంట విషాదం
ప్రధానమంత్రి నరేందర్ మోదీ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రధానమంత్రి మోదీ తల్లి గారైన హీరాబెన్ ఇటీవలే వందో పుట్టినరోజు పూర్తిచేసుకున్నరు. అయితే ఆమె గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో గుజరాత్ లోని అహ్మదాబాద్లోని యూఎన్ మెహతా దవాఖానలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆమె ఆరోగ్యం విషమించడంతో ఇవాళ ఉదయం మూడున్నర గంటలకు తుదిశ్వాస విడిచారు.దీంతో మోదీ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది.
Read More »అదానీ సంచలన వ్యాఖ్యలు
ప్రముఖ భారతదేశ వ్యాపార దిగ్గజం అయిన గౌతమ్ అదానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ అదానీ గ్రూప్ వ్యాపార సంస్థ ఇప్పటిది కాదు.. దాదాపు ముప్పై ఏండ్ల కిందట ప్రారంభమైంది.. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నసమయంలోనే ఈ సంస్థను ప్రారంభించాను.. ఆ తర్వాత ఎంతో మంది ప్రధానమంత్రులు వచ్చారు. మరెంతో మంది రాజకీయ నేతలు అధికారంలోకి వచ్చారు. నా సంస్థ యొక్క అభివృద్ధి ఏ ఒక్క నాయకుడి వల్ల …
Read More »