జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరికీ మంత్రి హరీశ్ రావు శుభాకాంక్షలు తెలిపారు. విద్య ద్వారానే మానవ వనరులు అభివృద్ధి చెందుతాయని అన్నారు. భారతీయ సంప్రదాయంలో దేవుడితో సమానమైన స్థానం గురువులకు ఉందని చెప్పారు. పిల్లలను బాధ్యతాయుత పౌరులుగా మార్చడంలో ఉపాధ్యాయుల కృషి గొప్పదని పేర్కొన్నారు. కరోనా కష్టకాలంలోనూ భౌతిక తరగతులు లేకున్నా.. ఆన్లైన్ క్లాసులతో బోధనకు అంతరాయం కలగకుండా కృషిచేశారని వెల్లడించారు. సీఎం కేసీఆర్ తెలంగాణలో విద్యకు అత్యంత …
Read More »తెలంగాణలో త్వరలో రెడ్డి కార్పొరేషన్
తెలంగాణలో త్వరలో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ వచ్చే బడ్జెట్లోనే రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. కేంద్రంలో రైతు వ్యతిరేక చట్టాలు బీజేపీ ప్రభుత్వం తెచ్చిందని విమర్శించారు. హుజురాబాద్కు మెడికల్ కాలేజీ వచ్చే అవకాశం ఉందని హరీష్రావు అభిప్రాయం వ్యక్తం చేశారు.
Read More »పిచ్చెక్కిస్తున్న పూజా హాట్ హాట్ ఫోటోలు
మూగమూడి అనే తమిళ చిత్రంతో హీరోయిన్గా పరిచయం అయి ఆ తర్వాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ముకుందతో టాలీవుడ్ ప్రేక్షకులకి దగ్గరైంది పూజా. ఒక లైలా కోసం చిత్రంతో తెలుగు తెరకు పరిచయం కాగా, ఈ మూవీ ప్రేక్షకులని పెద్దగా అలరించలేకపోయింది. ముకుంద సినిమాతో పూజాకి కొంత క్రేజ్ దక్కింది. జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘అరవింద సమేత.. వీరరాఘవ’తో కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నపూజా …
Read More »ఉపాధ్యాయులందరికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుభాకాంక్షలు
గురుపూజోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న ఉపాధ్యాయుల దినోత్సవం నిర్వహిస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్ను తీర్చిదిద్ది బాధ్యతగల పౌరులుగా తయారుచేసే బాధ్యత గురువులకు మాత్రమే దక్కుతుందని అన్నారు. రాష్ట్రంలో విద్య అభివృద్ధి కోసం మెరుగైన సౌకర్యాల కల్పన కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. పేద విద్యార్థులకు నాణ్యమైన …
Read More »దేశంలో కొత్తగా 42,766 కరోనా కేసులు
దేశంలో కొత్తగా 42,766 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,29,88,673కు చేరింది. ఇందులో 4,10,048 కేసులు యాక్టివ్గా ఉండగా, 3,21,38,092 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మరో 4,40,533 మంది మహమ్మారి వల్ల మృతిచెందారు. కరోనా రికవరీ రేటు 97.42 శాతానికి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా, కొత్తగా నమోదైన కేసులు, మరణాల్లో సగానికిపైగా కేరళలోనే ఉన్నాయని తెలిపింది. రాష్ట్రంలో …
Read More »హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్లో ప్రధాన ప్రజా రవాణా వ్యవస్థ అయిన మెట్రో రైలు సమయాల్లో అధికారులు మార్పులు చేశారు. సోమవారం (సెప్టెంబర్ 6) నుంచి మరో అరగంటపాటు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయని ప్రకటించారు. రేపటి నుంచి రాత్రి వేళల్లో 10.15 గంటలకు చివరి మెట్రో సర్వీసు ఉంటుందని తెలిపారు. ఇప్పటివరకు రాత్రి 9.45 గంటల వరకు చివరి మెట్రో రైలు సర్వీసులు నడిచేవన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం …
Read More »దద్దరిల్లిన బిగ్ బాస్ ప్రోమో
బుల్లితెర ప్రేక్షకులని అలరిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం తెలుగులో నాలుగు సీజన్స్ పూర్తి చేసుకొని ఐదో సీజన్కి సిద్ధమైంది. నేటి నుండి ఐదో సీజన్ ప్రసారం కానుండగా, ఇన్నాళ్లు ఈ కార్యక్రమానికి సంబంధించిన వస్తున్న వార్తలకు ఈ రోజుతో బ్రేక్ పడనుంది. ఈ రోజు సాయంత్రం 6గం.లకు లాంచింగ్ కార్యక్రమం ప్రసారం కానుండగా, దీనికి సంబంధించిన షూట్ నిన్ననే పూర్తైంది. తాజాగా మేకర్స్ సీజన్ 5కి …
Read More »కొత్త ఐపీఎస్ ఆఫీసర్లను ఇవ్వండి.. కేంద్ర హోంమంత్రిని కోరిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రానికి ఐపీఎస్ ఆఫీసర్ల సంఖ్యను పెంచాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ఇవాళ సీఎం కేసీఆర్ కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ ఇవాళ మధ్యాహ్నం అమిత్ షాను కలిశారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని వినతులు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రెండేళ్ల తర్వాత జిల్లాల పునర్ వ్యవస్థీకరణ జరిగిందని, దాంతో కొత్త జిల్లాలు, కొత్త జోన్లు, కొత్త మల్టీజోన్లు ఏర్పడ్డాయని, దానికి తగినట్లే …
Read More »న్యూజిలాండ్లో ఆరు నెలల తర్వాత తొలి కరోనా మరణం
న్యూజిలాండ్లో ఆరు నెలల తర్వాత తొలి కరోనా మరణం నమోదైంది. ఆ దేశ ఆరోగ్య అధికారులు శనివారం ఈ విషయాన్ని ధ్రువీకరించారు. 90 ఏండ్ల మహిళ కరోనా సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నదని తెలిపారు. వెంటిలేటర్ లేదా ఇంటెన్సివ్ కేర్ వ్యవస్థపై ఆమె లేకపోయినా శుక్రవారం రాత్రి ఆక్లాండ్ ఆసుపత్రిలో మరణించినట్లు చెప్పారు. న్యూజిలాండ్లో కోవిడ్ -19తో చనిపోయిన 27వ వ్యక్తి ఆ మహిళ అని, ఈ ఏడాది ఫిబ్రవరి …
Read More »సెప్టెంబర్ 30న దేశ వ్యాప్తంగా ఉప ఎన్నికలు
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి అభ్యర్థనను కేంద్ర ఎన్నికల సంఘం ఎట్టకేలకు అంగీకరించింది. బెంగాల్లో మమతాబెనర్జి బరిలో దిగాలని భావిస్తున్న భవానీపూర్ అసెంబ్లీ స్థానానికి సెప్టెంబర్ 30న ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అదేవిధంగా బెంగాల్లోని షంషేర్గంజ్, జాంగీర్పూర్ అసెంబ్లీ స్థానాలకు, ఒడిశాలోని పిప్లీ అసెంబ్లీ స్థానానికి కూడా సెప్టెంబర్ 30న ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ ఉపఎన్నికల్లో పోలైన ఓట్లను అక్టోబర్ 3న లెక్కించి ఫలితాలు వెల్లడించనున్నట్లు కేంద్ర …
Read More »