తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి సమాధి ప్రాంతంలో రూ.39 కోట్లతో స్మారక మండపాన్ని నిర్మించనున్నట్టు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రకటించారు. కలైవానర్ అరంగం హాలులో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో మంగళవారం ఉదయం 110వ నిబంధనల కింద ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. ఆ సందర్భంగా స్టాలిన్ ప్రసంగిస్తూ.. మెరీనాబీచ్లో కరుణానిధి సమాధి ప్రాంతం వద్ద 2.2 ఎకరాల్లో స్మారక మండపాన్ని నిర్మించనున్నామని తెలిపారు. ఏడుదశాబ్ధాలపాటు పాత్రికేయుడిగా, ఐదు దశాబ్దాలపాటు …
Read More »తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల
తెలంగాణ ఎంసెట్ ఫలితాలను (TS EAMCET RESULTS) మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఫలితాలను https://eamcet.tsche.ac.in వెబ్సైట్లో చూడవచ్చు. ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మా కోర్సుల ఎంసెట్ ర్యాంకులను ప్రకటించారు. రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఈనెల 4, 5, 6 (ఇంజినీరింగ్), 9, 10 తేదీల్లో (వ్యవసాయ, ఫార్మా ఎంసెట్) పరీక్షను నిర్వహించారు. ఇంజినీరింగ్ విభాగానికి 1,47,986 మంది, అగ్రికల్చల్, మెడికల్ స్ట్రీమ్కు 91.19 …
Read More »దేశంలో కరోనా విజృంభణ
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. నిన్న 25వేలకు చేరిన పాజిటివ్ కేసులు మళ్లీ భారీగా పెరిగాయి. మరో వైపు మరణాలు సైతం 600కుపైగా నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 37,593 కొత్త కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా 34,169 మంది బాధితులు కొలుకొని డిశ్చార్జి అయ్యారు. మహమ్మారి బారినపడి 24 గంటల్లో 648 మంది బాధితులు మృత్యువాతపడ్డారు. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.99 …
Read More »తెలంగాణ ఉన్నత విద్యామండలి నూతన చైర్మన్గా ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి
తెలంగాణ ఉన్నత విద్యామండలి నూతన చైర్మన్గా ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి నియమితులయ్యారు. మండలి వైస్ చైర్మన్-1గా ఉన్న ఆయనను కౌన్సిల్ నూతన అఫిషియేటివ్ చైర్మన్గా నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో లింబాద్రిని నియమిస్తూ విద్యాశాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా ఉత్తర్వులిచ్చారు. ప్రొ ఫెసర్ పాపిరెడ్డి చైర్మన్ పదవీ బాధ్యతలను మంగళవారమే లింబాద్రికి అప్పగించారు. 2014 ఆగస్టులో ఉన్నత విద్యామండలిని …
Read More »తెలంగాణలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు మార్గదర్శకాలివే..
తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం మంగళవారం ఆదేశాలు జారీచేసింది. ఇందుకు సంబంధించి రెండు జీవోలను ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్కుమార్ విడుదలచేశారు. ప్రభుత్వ నియామకాలు, విద్యాసంస్థల్లో ప్రవేశాల్లో 10 శాతం రిజర్వేషన్ల కోసం జీవో-244 జారీచేశారు. సబార్డినేట్ సర్వీస్ నిబంధనలు-1996కు సవరణ చేస్తూ జీవో-243 విడుదలచేశారు. నియామకాల్లో రోస్టర్ పాయింట్లను కూడా ప్రభుత్వం ఖరారుచేసింది. రూ.8 లక్షలలోపు వార్షికాదాయం ఉన్నవారు …
Read More »విద్యార్థుల నుంచి ట్యూషన్ ఫీజులు మాత్రమే వసూలు చేయాలి
ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు విద్యార్థుల నుంచి ట్యూషన్ ఫీజులు మాత్రమే వసూలు చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టంచేశారు. ఆ మొత్తాన్ని కూడా ఒకేసారి కాకుండా.. నెలనెలా తీసుకోవాలని పేర్కొన్నారు. కరోనా మొదటి వేవ్ సందర్భంగా స్కూల్ ఫీజుల వసూళ్లపై ప్రభుత్వం విడుదలచేసిన జీవో 48కి అనుగుణంగానే ఫీజులు వసూలుచేయాలని చెప్పారు. వచ్చేనెల 1 నుంచి పాఠశాలలు ప్రారంభంకానున్న నేపథ్యంలో మంగళవారం రంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి …
Read More »ఏ ఎన్నికైన టీఆర్ఎస్దే బ్రహ్మాండ విజయం – మంత్రి కేటీఆర్
టీఆర్ఎస్ పుట్టాక, రాష్ట్రం ఏర్పడ్డాక ఎన్నో ఎన్నికలను ఎదుర్కొన్నాం. అందులో హుజూరాబాద్ కూడా ఒకటి. అంతేతప్ప మరోటి కాదు. దాదాపు రెండున్నర గంటలపాటు జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణం, భవిష్యత్ వ్యూహంపై సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారే తప్ప.. హుజూరాబాద్ అనేపేరు ప్రస్తావించలేదు. హుజూరాబాద్ ఉపఎన్నిక తేదీ వస్తే దాని ప్రస్తావన వస్తది. అప్పుడు పార్టీ చర్చిస్తది. అంతకుముందే పత్రికల్లో రాసినా.. టీవీల్లో చర్చించినా అదొక …
Read More »చిత్తశుద్ధి ఉంటే హుజూరాబాద్కు రండి-ప్రతిపక్షాలకు మంత్రి కేటీఆర్ సవాల్
సీఎం కేసీఆర్ ఏదిచేసినా ముందే అనుమానాలు వ్యక్తంచేస్తరు. బలహీనమైన గుండె ఉన్నవాళ్లు అవలీలగా ఢాం అని అడ్డంపడతరు. సీఎం కేసీఆర్ రాష్ట్ర ఉద్యమాన్ని ప్రారంభించిననాడు, తెలంగాణ వస్తది అన్ననాడు కూడా ఇట్లానే పిచ్చిప్రేలాపనలు చేసినవాళ్లు ఎంతోమంది ఉన్నారు. ఈ రోజు దళితబంధు ప్రారంభిస్తే కూడా ఇట్లనే అంటున్నరు. ముందు నవ్వుతరు. వెకిలి మాటలు మాట్లడతరు. అవమానిస్తరు. ఆఖరికి గెలిచాక పక్కకొచ్చి ఫొటో దిగి పోతరు. అట్లా మాట్లాడేవాళ్లకు నిజంగా చిత్తశుద్ధి …
Read More »మరో 20 ఏళ్లు టీఆర్ఎస్దే అధికారం
రానున్న 20 ఏళ్లు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే ఉంటుందని ఆ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు. టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మంగళవారం నగరంలోని తెలంగాణ భవన్లో జరిగిన టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణంపై సీఎం చర్చించారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి శాఖల పునర్నిర్మాణం వరకు సమావేశంలో చర్చించారు. అదేవిధంగా …
Read More »దళితబంధు పథకానికి మరో రూ. 200 కోట్లు విడుదల
దళితబంధు పథకానికి తెలంగాణ ప్రభుత్వం మరో రూ. 200 కోట్లు కేటాయిస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. దళితుల సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నది. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈ నెల 16న ఈ పథకానికి సంబంధించిన పైలెట్ ప్రాజెక్టును ప్రారంభించింది. నియోజకవర్గంలోని ప్రతి దళిత కుటుంబానికి ఈ పథకం కింద రూ.10 లక్షల చొప్పున అందించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇప్పటికే దళిత బంధు …
Read More »