తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం 1,20,043 టెస్టులు చేయగా.. 1,556 మందికి కరోనా నిర్ధారణ అయింది. వైర్సతో 14 మంది చనిపోయారు. మొత్తం కేసులు 6,06,436కు, మరణాలు 3,510కు చేరాయి. తాజా కేసుల్లో జీహెచ్ఎంసీలో 182, ఖమ్మంలో 131, నల్లగొండలో 135, భద్రాద్రి-కొత్తగూండెంలో 114 నమోదయ్యాయి. సోమవారం ప్రభుత్వ, ప్రైవేటు కేంద్రాల్లో 1,79,568 మంది తొలి డోసు, 6,959 మంది రెండో డోసు తీసుకున్నారు.
Read More »తెలంగాణలో మరో 16 చోట్ల డయాగ్నస్టిక్ కేంద్రాలు
తెలంగాణ వ్యాప్తంగా ఖరీదైన రోగ నిర్ధారణ పరీక్షలను పేద ప్రజలకు ఉచితంగా అందుబాటులోకి తెచ్చేందుకుగాను రాష్ట్రంలో మరిన్ని డయాగ్నస్టిక్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్తగా 15 జిల్లాల్లో 16 చోట్ల ఈ కేంద్రాలను, గ్రేటర్ హైదరాబాద్ పరిఽధిలో మరో 12 చోట్ల మినీ హబ్లను ఏర్పాటు చేయనుంది. వీటిని ఈ ఏడాది ఆగస్టు నాటికి అందుబాటులోకి తీసుకురానుంది. ఈ కేంద్రాల్లో మొత్తం 57 రకాల రోగ నిర్ధారణ …
Read More »ట్విట్టర్ కు షాక్
ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విటర్ మన దేశంలో చట్టపరమైన రక్షణను కోల్పోయినట్లు ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా బుధవారం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన ఇన్మర్మేషన్ టెక్నాలజీ నిబంధనలను పాటించకపోవడంతో ట్విటర్కు చట్టపరమైన రక్షణను తొలగించినట్లు తెలుస్తోంది. దీంతో ట్విటర్ ఇకపై తటస్థ, మధ్యవర్తిత్వ వేదిక కాదని, ఇది డిజిటల్ న్యూస్ పబ్లిషర్గా ఉంటుందని సమాచారం. జాతీయ మీడియా తెలిపిన వివరాల ప్రకారం, కొత్త ఐటీ నిబంధనల ప్రకారం …
Read More »హుజూరాబాద్ బీజేపీలో వర్గపోరు
తెలంగాణలోని హుజూరాబాద్ బీజేపీలో వర్గపోరు మొదలైంది. బుధవారం హుజూరాబాద్ ఇన్చార్జ్గా ఉన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి తన అనుచరులతో భేటీ కారున్నారు. కోవిడ్ కారణంగా మూడు నెలలుగా నియోజకవర్గానికి ఆయన దూరంగా ఉన్నారు. ఇప్పుడు బీజేపీలోకి ఈటల రాజేందర్ రాకతో కాకరేగుతోంది. ఈటల చేరికను పెద్దిరెడ్డి వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. మూడు నెలల తర్వాత ఆయన ఇవాళ హుజూరాబాద్కు వస్తున్నారు. కార్యర్తలు, అనుచరులు, సన్నిహితులతో సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం భవిష్యత్ కార్యాచారణపై …
Read More »తొలిరోజు రికార్డు స్థాయిలో రైతుబంధు సాయం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నుంచి రైతుబంధు పంపిణీని ప్రారంభించింది. తొలిరోజు ఎకరా భూమి గల రైతుల ఖాతాల్లో నగదు జమ చేసింది. రైతుబంధు పంపిణీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా తొలిరోజు 16,95,601 మంది రైతులకు రైతుబంధు అందింది. 10,33,915 ఎకరాలకు రూ. 516.95 కోట్లు పంపిణీ చేయడం గమనార్హం. తొలిరోజు రైతుబంధు అందుకున్న వారిలో నల్లగొండ రైతులు ఎక్కువగా ఉండగా ఆదిలాబాద్ రైతులు తక్కువగా ఉన్నారు. నల్లగొండకు చెందిన …
Read More »తెలంగాణలో స్థానిక ప్రజానిథులకు శుభవార్త
తెలంగాణ రాష్ట్రంలోని సర్పంచ్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీల గౌరవ వేతనాలను 30 శాతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం వెలువరించింది. అదేవిధంగా హోంగార్డులు, అంగన్వాడీ వర్కర్స్/సహాయకులు, విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్స్, విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్, ఆశా వర్కర్స్, సెర్ప్ ఉద్యోగుల జీతాలను 30 శాతం పెంచుతూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు వెలువరించింది. జెడ్పీటీసీ ఎంపీటీసీ లకు 30 శాతం జీతాలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయడం పట్ల స్థానిక సంస్థల …
Read More »సినిమాలకు నటి అనిత గుడ్ బై
అప్పుడెప్పుడో వచ్చిన నువ్వునేను సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది అనిత. ఆ తర్వాత పలు తెలుగు, హిందీ చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. ఈ ముంబై భామ 2013లో కార్పోరేట్ ప్రొఫెషనల్ రోహిత్ రెడ్డిని పెండ్లి చేసుకుంది. వీరిద్దరికి ఈ ఏడాది ఫిబ్రవరిలో బాబు పుట్టగా..ఆ బుడతడి పేరు ఆరవ్ రెడ్డి. వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పాలనుకుంటోందట అనిత. ఇదే విషయంపై అనిత మాట్లాడుతూ..నాకు పిల్లలున్నపుడు సినిమా …
Read More »మళ్లీ తెరపైకి డ్రగ్స్ కేసు..-టాలీవుడ్ హీరోయిన్ అరెస్ట్
డ్రగ్స్ కేసులో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు దక్షిణాది నటి నైరా షాను అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డ్రగ్స్ వాడుతున్నారన్న సమాచారంతో ముంబై జుహూలోని హోటల్ రూంలో ఎన్సీబీ అధికారులు తనిఖీలు చేపట్టి..నైరా షాతోపాటు ఆమె స్నేహితుడు ఆశిఖ్ సాజిద్ హుస్సేన్ ను అరెస్ట్ చేశారు. సిగరెట్స్ లో చుట్టబడి ఉన్న ఒక గ్రాము గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు ఎన్సీబీ అధికారి …
Read More »సాగులో దేశానికే దిక్సూచిగా తెలంగాణ
పంటల సాగులో తెలంగాణ దేశానికే దిక్సూచిగా నిలుస్తున్నదని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం పరిధిలో మంత్రి జగదీశ్రెడ్డి, ఎంపీ బడుగుల లింగ య్య, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి మంత్రి కేటీఆర్ మంగళవారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవా లు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భం గా నిర్వహించిన సభలో కేటీఆర్ మాట్లాడు తూ.. రాష్ట్రం రాకముందు 30లక్షల ఎకరా ల్లో మాత్రమే …
Read More »సంతోష్బాబు కుటుంబానికి ప్రభుత్వం పూర్తి అండ : మంత్రి కేటీఆర్
అమరవీరుడు, కర్నల్ సంతోష్బాబు కుటుంబానికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని రాష్ట్ర ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. భారత్-చైనా సరిహద్దులో విధులు నిర్వర్తిస్తూ భారతావని కోసం వీరోచితంగా పోరాడి అమరుడైన కర్నల్ సంతోష్ బాబు తొమ్మిది అడుగుల కాంస్య విగ్రహాన్ని మంత్రి కేటీఆర్ మంగళవారం సూర్యాపేటలో కోర్టు చౌరస్తాలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కోర్టు చౌరస్తాకు కల్నల్ సంతోష్బాబు చౌరస్తాగా మంత్రి నామకరణం చేశారు. అనంతరం జరిగిన విగ్రహావిష్కరణ …
Read More »