తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఒక శుభవార్తను తెలిపారు. రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న అన్ని ఖాళీలను భర్తీ చేస్తామని ప్రకటించారు. యూనివర్సిటీ నియామాకాలకు సంబంధించిన అన్ని అడ్డంకులు తొలగిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి సబితా తెలిపారు.బుధవారం అసెంబ్లీ సబ్జెట్ సమావేశాల్లో జరిగిన పాఠశాల విద్య,ఉన్నత విద్య,సాంకేతిక విద్య పద్దులపై పలు పార్టీలకు చెందిన సభ్యులు అడిగిన …
Read More »షర్మిల బరిలోకి దిగే అసెంబ్లీ ఫిక్స్
తెలంగాణ రాష్ట్రంలో సరికొత్త రాజకీయ పార్టీ పెట్టనున్నట్లు వైఎస్ షర్మిల ఇప్పటికే ప్రకటించిన సంగతి విదితమే. ఇందులో భాగంగా వచ్చే నెల ఏఫ్రిల్ 9న ఖమ్మంలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు కూడా ఆమె ప్రకటించారు. అయితే తాను ఎక్కడ నుండి బరిలోకి దిగితానో అనే అంశం గురించి వైఎస్ షర్మిల క్లారిటీచ్చారు. బుధవారం జరిగిన ఖమ్మంజిల్లాకు చెందిన వైఎస్సార్ అభిమానులతో ఆమె సమావేశమయ్యారు. ఈ క్రమంలో తాను రాష్ట్రంలోని …
Read More »జిల్లా ఆస్పత్రుల్లోనూ డయాగ్నొస్టిక్ సెంటర్లు : మంత్రి ఈటల
శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగ నిర్ధారణ కేంద్రాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సమాధానం ఇచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రులు ఇప్పటికే ప్రమాణాల ప్రకారంగా డయాగ్నోస్టిక్ సౌకర్యాలను కలిగి ఉన్నాయి. దీనికి అదనంగా జిల్లా ఆస్పత్రుల్లో కొత్తగా డయాగ్నోస్టిక్ సెంటర్లను ఏర్పాటు చేస్తుంది. హైదరాబాద్, సిద్దిపేట జిల్లా కేంద్రాల్లో ఇప్పటికే రెండు సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. ఈ ల్యాబ్లలో 60 రకాల పరీక్షలు …
Read More »చెత్తను తరలించేందుకు స్వచ్ఛ ఆటోలు -మంత్రి కేటీఆర్
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటికే 2500 స్వచ్ఛ ఆటోలు నడుస్తున్నాయని మంత్రి కెటిఆర్ తెలిపారు. గురువారం ఉదయం కెటిఆర్ స్వచ్ఛ హైదరాబాద్ లో భాగంగా 325 స్వచ్ఛ ఆటోలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చెత్తను తరలించేందుకు ఇంతవరకు ఉన్న పాత వాహనాలకు స్వస్తి పలికి స్వచ్ఛ ఆటోలను నడిపిస్తున్నామని ఆయన చెప్పారు. ఒక్కో స్వచ్ఛ ఆటో 1.5 మెట్రిక్ టన్నుల గార్బేజ్ ను తరలిస్తుందని ఆయన పేర్కొన్నారు. …
Read More »నైపుణ్య శిక్షణా కేంద్రాలుగా రైతు వేదికలు : మంత్రి నిరంజన్ రెడ్డి
శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా రైతు వేదికల నిర్మాణంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సమాధానం ఇచ్చారు. రాష్ర్ట వ్యాప్తంగా ఇప్పటి వరకు 2,596 రైతు వేదికలు నిర్మించామని తెలిపారు. రైతు వేదికల నిర్మాణాల కోసం రూ. 572 కోట్ల 22 లక్షల మొత్తాన్ని ఖర్చు చేశామన్నారు. వ్యవసాయం, అనుబంధ శాఖల ద్వారా ఆధునిక వ్యవసాయ సమాచారం, అవగాహన కల్పించడం కోసం, నైపుణ్య శిక్షణా కేంద్రాలుగా …
Read More »తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు తొమ్మిదో రోజు ప్రారంభమయ్యాయి. శాసనసభను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. సభ్యులందరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని స్పీకర్ విజ్ఞప్తి చేశారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సమావేశాల్లో స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ప్రశ్నోత్తరాలు ముగిసిన వెంటనే బడ్జెట్ పద్దులపై చర్చ ప్రారంభించనున్నారు. ఈ నెల 15న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు రేపటితో ముగియనున్నాయి.గత రెండు రోజులుగా 26 పద్దులపై చర్చించి వాటిని ఆమోదించారు. ఇవాళ …
Read More »ఎమ్మెల్సీ వాణీదేవి కారుకు ప్రమాదం
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్సీ సురభి వాణీదేవి కారు ప్రమాదానికి గురైంది. అసెంబ్లీ గేట్ నంబర్ ఎనిమిదిని ఆమె కారు ఢీకొన్నది. ఎమ్మెల్సీని మండలి వద్ద దింపి వస్తుండగా ప్రమాదం జరిగింది. పార్కింగ్ చేస్తుండగా అదుపుతప్పిన కారు రైల్వే కౌంటర్ సమీపంలోని గేటుపైకి దూసుకెళ్లింది. దీంతో కారుటైరు పేలిపోయింది. ప్రమాద సమయంలో కారును ఎమ్మెల్సీ గన్మెన్ నడిపినట్లు సమాచారం. అయితే భారీగా శబ్ధం రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
Read More »బ్యాంకులకు 7రోజులు వరుసగా సెలవులు.. ఇందులో నిజం ఎంత..?
బ్యాంకుల్లో పనులు ఉంటే ఈ రెండు, మూడు రోజుల్లోనే చేసేసుకోండి. ఎందుకంటే ఈ నెల 27తో మొదలుపెడితే వచ్చే నెల 4 వరకూ బ్యాంకులకు వరుస సెలవులు వస్తున్నాయి. శని, ఆదివారాలు, పండగలు, ఆర్థిక సంవత్సరం ముగింపు అంటూ మొత్తం 7 రోజుల పాటు బ్యాంకులకు తాళాలు పడనున్నాయి. మధ్యలో కేవలం మార్చి 30, ఏప్రిల్ 3న మాత్రమే బ్యాంకులు పని చేస్తాయి. ఈ శుక్రవారంలోపు మీ బ్యాంకు పని …
Read More »రొమాంటిక్ ప్రేమ కథాంశంతో అనుష్క
బొమ్మాళి అనుష్క, నవీన్ పొలిశెట్టి కాంబోలో ఓ సినిమా రానున్నట్లు కొంతకాలంగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా దీనికి సంబంధించి మరో వార్త వైరలవుతోంది. ఈ సినిమా రొమాంటిక్ ప్రేమ కథాంశంతో తెరకెక్కనుందని సమాచారం. ఇందులో 40 ఏళ్ల మహిళ పాత్రలో అనుష్క, 20 ఏళ్ల కుర్రాడిలా నవీన్ పొలిశెట్టి కనిపించనున్నారని టాలీవుడ్ టాక్. ఈ లేటు ఘాటు ప్రేమ కాన్సెప్టు ఎంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది
Read More »బాలీవుడ్ లోకి నాగబాబు ఎంట్రీ
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు నాగబాబు బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ‘ఛత్రపతి’ రీమేక్ తో ఆయన బీటౌన్ లోకి వెళ్లనున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ మూవీని హిందీలోకి రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కనున్న ఈ రీమేక్ ను డైరెక్టర్ వి.వి.వినాయక్ రూపొందించనున్నాడు. ఇందులో నాగబాబు విలన్ పాత్ర పోషిస్తాడట.
Read More »