తెలంగాణలో కొవిడ్-19 లాక్డౌన్ కొనసాగుతున్నా.. గంటకొట్టినట్టే అంగన్వాడీల ద్వారా గర్భిణుల ఇంటి కి ఠంచన్గా పౌష్టికాహారం చేరుతున్నది.. గర్భిణుల ఆరోగ్య స్థితిపై ఏఎన్ఎంలు ఎప్పటికప్పుడు వాకబుచేస్తూ సూచనలిస్తున్నారు.. ఆపత్కాలం లో అమ్మఒడి వాహనాలు గడప ముందుకొస్తున్నాయి. కరోనా వేళ ప్రాణాలు పణంగా పెట్టి సేవలందిస్తున్న ప్రభుత్వ వైద్యులపై మరింత నమ్మకం ఏర్పడింది.. ఫలితంగా ఏప్రిల్, మే నెలల్లో వందశాతం డెలివరీలు ప్రభుత్వ దవాఖానల్లోనే జరుగుతాయని వైద్యారోగ్య, కుటుంబసంక్షేమశాఖ అంచనా వేస్తున్నది. …
Read More »హైదరాబాద్లోకరోనా కిట్స్
హైదరాబాద్కు చెందిన ‘హువెల్ లైఫ్ సైన్సెస్’ సంస్థ అరుదైన ఘనత సాధించింది. కరోనా నిర్ధారణ పరీక్షలు జరుపడానికి ఆ సంస్థ అభివృద్ధి చేసిన టెస్ట్ కిట్కు ‘ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్’ (ఐసీఎంఆర్) ఆమోదం లభించింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు వివిధ సంస్థలు తయారుచేసిన మొత్తం 24 కిట్లలో ఆరింటికి మాత్రమే ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చింది. ఇందులో హువెల్ లైఫ్ సైన్సెస్ కిట్ కూడా ఉండటం విశేషం. అమెరికా నేషనల్ …
Read More »ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ కొత్త రికార్డు
ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ కొత్త రికార్డులు సృష్టించిందని, రాష్ట్ర విభజన అనంతరం అనూహ్యమైన అభివృద్ధి సాధించిందని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ) జనరల్ మేనేజర్ అశ్వినీకుమార్గుప్తా చెప్పారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగాచేపట్టి, పూర్తిచేసిన నీటిపారుదల ప్రాజెక్టుల ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయన్నారు. తాజా గణాంకాలను బట్టి చూస్తే దేశంలో ఆహారధాన్యాలను అత్యధికంగా ఉత్పత్తిచేస్తున్న రాష్ర్టాల్లో పంజాబ్, హర్యానా తర్వాత తెలంగాణ నిలిచిందని తెలిపారు. కేరళ, కర్ణాటకలతోపాటు పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ర్టాలకు కూడా …
Read More »లాక్ డౌన్ పొడగింపునకు మించిన మార్గం లేదు
కరోనా వ్యాప్తిని నియంత్రించడానికి లాక్ డౌన్ పొడగింపునకు మించిన మార్గం లేదు భారత ప్రభుత్వం, అన్ని రాష్ట్రాలు కలిసికట్టుగా పనిచేస్తూ దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి చేస్తున్న ప్రయత్నాలు ఎంతో బాగున్నాయి కరోనా కట్టడి కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇరవై నాలుగు గంటల పాటు కష్టపడుతున్నారు లాక్ డౌన్ వల్ల కష్టనష్టాలున్నప్పటికీ ఇది తప్పని చర్య. ప్రతికూల పరిస్థితుల్లో ఇదే ఉత్తమమైన మార్గం. మనం ఒకసారి …
Read More »తెలంగాణలో ఒక్కరోజే 75 కేసులు
తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒక్కరోజు డెబ్బై ఐదు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 229కి చేరుకుంది.మరోవైపు ఈ రోజు పదిహేను మంది కరోనా కు చికిత్స పొంది పూర్తిగా నయమై డి శార్జ్ అయి ఇంటికెళ్ళారు. మరోవైపు కరోనా కారణంగా ఇవాళ ఒక్కరోజే ఇద్దరు మృత్యువాత పడ్డారు .ఇప్పటివరకు ముప్పై రెండు మంది పూర్తిగా నయమై …
Read More »రూ.50లక్షల చెక్ ను అందజేసిన బాలయ్య
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు,స్టార్ హీరో యువరత్న నందమూరి బాలకృష్ణ కరోనా బాధితుల సహాయార్థం ఏపీ,తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయనిధికి చెరో యాబై లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించిన సంగతి తెల్సిందే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రకటించిన రూ.యాబై లక్షల చెక్ ను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కేటీఆర్ కు ప్రగతి భవన్లో అందజేశారు.తెలంగాణలో కరోనా నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయం.. తెలంగాణ దేశానికి …
Read More »తెలంగాణలో ఒకే కుటుంబంలో నలుగురికి కరోనా
తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒక్కరోజు శుక్రవారం నాడు డెబ్బై ఐదు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 229కి చేరుకుంది.మరోవైపు శుక్రవారం రోజు పదిహేను మంది కరోనా కు చికిత్స పొంది పూర్తిగా నయమై డి శార్జ్ అయి ఇంటికెళ్ళారు. మరోవైపు కరోనా కారణంగా శుక్రవారం ఒక్కరోజే ఇద్దరు మృత్యువాత పడ్డారు .ఇప్పటివరకు ముప్పై రెండు మంది పూర్తిగా నయమై …
Read More »ఆకాశాన్నంటిన మద్యం ధరలు
తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల పదిహేను వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి విదితమే.మెడికల్ ,నిత్యవసర వస్తువులను పంపిణీ చేసే సంస్థలు తప్పా అన్నీ బంద్ అయిన సంగతి కూడా తెల్సిందే. అయితే గత మూడు వారాల నుండి వైన్స్ బార్లు కూడా బంద్ ఉండటంతో మద్యం ప్రియులు ఆగఆగమవుతున్నారు.దీంతో వైన్స్ బార్ల యజమానులే బ్లాక్లో మద్యాన్ని అమ్ముతున్నారు. ఈ క్రమంలో …
Read More »భద్రాద్రిలో నిరాడంబరంగా రాములోరి కల్యాణం
భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. కరోనా వైరస్ కారణంగా ఈ సారి భక్తజనం లేకుండానే సీతారామ కల్యాణం, పట్టాభిషేకం క్రతువులు నిర్వహించారు. ప్రభుత్వం తరపున మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ శ్రీసీతారాముల స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు. వైదిక పెద్దలు, అర్చకుల సమక్షంలో స్వామివారి కల్యాణం జరిగింది. ఏటా మిథిలా స్టేడియంలో ఈ వేడుకలు నిర్వహించేవారు. ఈసారి ఆలయంలోని మండపంలోనే రాములవారి …
Read More »తెలంగాణలో కరోనాతో ముగ్గురు మృతి
తెలంగాణ రాష్ట్రంలో కూడా కరోనా వైరస్ బారీన పడిన వారు మృత్యువాత పడుతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.బుధవారం కరోనా వైరస్ బారీన పడినవారిలో ముగ్గురు మృతి చెందారని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వీరిలో సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఇద్దరు చనిపోగా..యశోద ఆసుపత్రిలో ఒకరు చనిపోయారని ప్రభుత్వం వెల్లడించింది. ఈ మూడు మరణాలతో కలిపి ఇప్పటివరకు కరోనా వైరస్ తో చనిపోయిన వారి సంఖ్య తొమ్మిదికి చేరుకుంది.నిన్న బుధవారం ఒక్క రోజే …
Read More »